Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh Farmers Stand First In The Country In Per Capita Debt Burden Says Union Agriculture Minister Narendra Singh Tomar

Farmers’ debts: రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు.. కేంద్రం ప్రకటన..

Published Date :December 24, 2022 , 9:41 am
By Sudhakar Ravula
Farmers’ debts: రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు.. కేంద్రం ప్రకటన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌.. రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని.. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉంటే.. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్ ఉన్నాయని.. జాతీయ సగటు కంటే ఏపీ అప్పు మూడు రెట్లు, తెలంగాణ అప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు..

Read Also: Pathan Movie Controversy: ‘పఠాన్’కు వివాదంలోకి ప్రముఖ సింగర్.. జనాలు సెన్సిటివ్ గా మారారని వ్యాఖ్య

జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబంపై రూ.74,121 కోట్ల రుణభారం ఉందని తెలిపారు నరేంద్రసింగ్‌ తోమర్.. ఏపీలో ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉంటే.. తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంపై రూ.1,52,113 మేర రుణభారం ఉందన్నారు.. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ.10,218తో పోలిస్తే ఏపీ రైతు కుటుంబాల ఆదాయం (రూ.10,480) 2.56%మేర ఎక్కువగా ఉందని.. అప్పు మాత్రం దాదాపు మూడురెట్లు అధికంగా ఉందని చెప్పారు.. ఇక, తెలంగాణ రైతుల మీద కూడా జాతీయ సగటుకంటే రెండురెట్ల అప్పు ఎక్కువగా ఉండగా.. ఇదే సమయంలో అక్కడి రైతుల నెలవారీ ఆదాయం రూ.9,403కే పరిమితం అయ్యింది.. ఇది జాతీయ సగటు ఆదాయం (రూ.10,480) కంటే 7.9% తక్కువగా ఉందని పేర్కొన్నారు..

కేంద్ర ప్రభుత్వం 2008-09లో వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం అమలు చేసిందని, ఆ తర్వాత కేంద్రం మళ్లీ ఎప్పుడూ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. అయితే రైతులపై రుణభారాన్ని తగ్గించేందుకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఏటా రూ.6 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబంపై సగటున రూ.లక్షకుపైగా రుణభారం ఉన్న రాష్ట్రాలు 8 ఉండగా, అందులో దక్షిణాది నుంచి నాలుగు రాష్ట్రాలున్నాయి. అందులోనూ మిగతా రాష్ట్రాలకంటే తెలుగు రాష్ట్రాల్లోని రైతుల కుటుంబాల ఆదాయం అతితక్కువగా ఉంది. అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకొనే ఈశాన్యరాష్ట్రాల్లో సగటు రైతు కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.16,863, సగటు రుణభారం రూ.13,642 ఉండగా, తెలుగురాష్ట్రాలు రెండు విషయాల్లోనూ వాటికంటే వెనుకబడి ఉన్నాయి. తలసరి అప్పుల భారంలో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పులు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.74,121 కోట్ల అప్పు ఉండగా, ఏపీ రైతులపై మూడింతలు భారం ఉంది. తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబానికి రూ.1,52,113 అప్పు ఉంది. అప్పుల పాలైన రాష్ట్రంగా 5వ స్థానంలో ఉంది.

మరోవైపు.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ)లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో, తెలంగాణ 7వ స్థానంలో నిలిచాయి. ఈ తొమ్మిది నెలల్లో దేశంలోకి 42,509 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు రాగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు 217 మిలియన్ డాలర్లు (0.51%) మాత్రమే వచ్చాయి. తెలంగాణకు 1287 మిలియన్ డాలర్లు (3.02%) వచ్చింది. కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Farmer Family
  • Farmers
  • farmers debts
  • Narendra Singh Tomar

తాజావార్తలు

  • Indian Railways: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో నాసిరకం ఆహారం.. కంపెనీకి రూ. 50 లక్షల జరిమానా

  • Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

  • Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

  • Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!

  • Bengal Election: ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్..

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions