ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ టాప్లో ఉందని.. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉంటే.. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ ఉన్నాయని.. జాతీయ సగటు కంటే…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. పంటలు పండకపోవటంతో భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. గత యేడాది మిర్చి సాగు చేసిన రైతుల పంట పండింది. ఎగుమతులు సైతం పెరిగాయి. విదేశాల నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 18 వేల పైచిలుకు ధర పలుకుతోంది. గతంలో ఏసీ మిర్చికి మాత్రమే…