ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 104 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 20,392 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,71,742 కి చేరగా.. యాక్టివ్ కేసులు 1,73,622 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 14,87,382 కరోనా నుంచి కోలుకోగా 10,738 మంది ప్రాణాలు కోల్పోయారు