నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం కవైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఇవాళ నూతన విద్యావిధానంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించాలని ఖరారు చేశారు.. స్టూడెంట్, టీచర్ రేష్యో పై తయారు చేసిన ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు..
శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2. 1, 2), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకు), ప్రీ హైస్కూల్స్ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకు), హైస్కూల్స్ ( 3 నుంచి 10వ తరగతి వరకు), హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) వర్గీకరణ జరగనుంది.. ఈ వర్గీకరణవల్ల స్కూళ్ళ సంఖ్య 44 వేల నుంచి సుమారు 58 వేల వరకు అవుతాయని సీఎంకు వివరించిన అధికారులు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు.. అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్ ఛానల్ ఏర్పడుతుందన్న సీఎం.. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించాలని స్పస్టం చేశారు.. ఎన్ఈపీపై కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, పీడీలకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.. ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19లో 70.43 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి రూ.73.06 లక్షలకు చేరినట్టు అధికారులు సీఎంకు తెలిపారు.. ఇక, పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 16న విద్యాకానుక ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.