కొత్త విద్యావిధానంపై సీఎం సమీక్ష.. 44 వేల నుంచి 58 వేలకు స్కూళ్ల సంఖ్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం కవైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఇవాళ నూతన విద్యావిధానంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించాలని ఖరారు చేశారు.. స్టూడెంట్, టీచర్ రేష్యో పై తయారు చేసిన ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు..
శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2. 1, 2), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకు), ప్రీ హైస్కూల్స్ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకు), హైస్కూల్స్ ( 3 నుంచి 10వ తరగతి వరకు), హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) వర్గీకరణ జరగనుంది.. ఈ వర్గీకరణవల్ల స్కూళ్ళ సంఖ్య 44 వేల నుంచి సుమారు 58 వేల వరకు అవుతాయని సీఎంకు వివరించిన అధికారులు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు.. అర్హతలున్న అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్ ఛానల్ ఏర్పడుతుందన్న సీఎం.. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్గా బోధించాలని స్పస్టం చేశారు.. ఎన్ఈపీపై కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, పీడీలకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.. ప్రభుత్వ పాఠశాలల్లో 2018–19లో 70.43 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి రూ.73.06 లక్షలకు చేరినట్టు అధికారులు సీఎంకు తెలిపారు.. ఇక, పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 16న విద్యాకానుక ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
తాజావార్తలు
-
PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?
-
Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
-
Suvendu Adhikari: “సువేందు అధికారి అనే నేను”.. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గడ్డపై జెండా పాతిన బీజేపీ!
-
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
-
Norovirus Outbreak: క్రూయిజ్ షిప్లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత