Education: విద్యాశాఖపై సీఎం కీలక సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యావిధానంలో మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు.. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని అధికారులు తెలిపారు.. ఇక, ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్ పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన జరుగుతుందని వెల్లడించారు.. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్ ఉంటుందని.. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని. జూనియర్ కళాశాలలు లేని మండలాలను గుర్తిస్తున్నట్టు సీఎంకు వివరించారు.. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు..
Read Also: Foreign Tourist: ఇండియా చూద్దామని వచ్చా.. ఇలా జరుగుతుందనుకోలేదు..
Also Read
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారు.. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే.. నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు.. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన.. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించామని తెలిపారు.. సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్న ఆయన.. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.. దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలని ఆదేశించారు. లెర్నింగ్ టు లెర్న్ కాన్పెప్ట్లోకి తీసుకెళ్లాలని ఆదేశించిన ఏపీ సీఎం.. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని.. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు – నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. స్కూళ్లలో నాడు – నేడు కింద ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి.. లేకపోతే వ్యర్థమవుతుందన్న ఆయన.. మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు–నేడు రెండో విడత మొదలు పెట్టాలని ఆదేశించారు.. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలని స్పష్టం చేసిన సీఎం.. ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
MOTOROLA Moto Book 60 Pro: మళ్లీరాని ఆఫర్.. మోటరోలా AI ల్యాప్టాప్.. సగం ధరకే.. OLED డిస్ప్లే
-
హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్పై హుమా ఫైర్
ట్రెండింగ్
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!