ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది.. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితితో పాటు.. ఉద్యోగుల పీఆర్సీ, హెచ్ఆర్ఏ సహా పలు అంశాలపై చర్చ సాగగా.. కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్..
- రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ, తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.. కోవిడ్ నివారణా చర్యలను మంత్రివర్గానికి వివరించారు అధికారులు.
- ఈబీసీ నేస్తానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఈ నెల 25న ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం కాబోతోంది.. ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేళ్లలో రూ.45వేలు ఇవ్వనున్నారు.. ఈబీసీల్లో 45–60 ఏళ్ల మధ్యనున్న అర్హులైన మహిళలకు ఈ పథకం వర్తింపజేయనున్నారు.. మొత్తం 3,92,674 మంది మహిళలకు లబ్ధి చేకూరనుండగా.. దీనికోసం రూ.589.01 కోట్లు వెచ్చించనుంది ప్రభుత్వం.
- 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7880 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రూ.3820 కోట్లతో పాత మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు పరిపానలపరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- 11వ పీఆర్సీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
- కోవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాల కోసం కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదం వేసింది.. వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు.. జూన్ 30 లోగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.
- జగనన్నస్మార్ట్టౌన్షిప్స్లో 10 శాతం స్థలాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిజర్వ్ ఫెన్షనర్లకు 5 శాతం స్ధలాలు రిజర్వ్ , ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్టౌన్షిప్.. 20శాతం రిబేటుతో ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- ఎన్ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
*ఆయుష్ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం వేసింది.. 26 డిస్పెన్సరీల్లో ముగ్గురు చొప్పున 78 పోస్టులు భర్తీచేయనుంది. - మున్సిపాల్టీగా మారిన వైయస్సార్ తాడిగడపలో పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్న 59 పోస్టులను మున్సిపాల్టీలో బదిలీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- కర్నూలు జిల్లా డోన్లో బాలికల బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీ, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
- కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆపరేషనల్ మెయింటైనెన్స్ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఓ అండ్ ఏం (ఆపరేషనల్ అండ్ మెయింటైనెన్స్) కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. అందులో పనిచేసే జెన్కో ఉద్యోగులను తిరిగి జెన్కోలోకి వచ్చేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్టపట్నం థర్మల్ ప్లాంట్. కిలోవాట్ కోసం అవుతున్న ఖర్చు రూ.3.14.. దాని పక్కనే ఉన్న మరో పవర్ ప్లాంట్లో కి లోవాట్ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34.. ఈ నేపధ్యంలో ఆపరేషనల్ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ హక్కులు వేరొకరికి అప్పగించడానికి ఓ అండ్ ఎం కోసం బిడ్డింగ్కు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది.
- జనవరి 1, 2022 నుంచి పెన్షన్ను 2,250 నుంచి రూ.2500కు పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏపీఐఐసీ నోడల్ ఏజెన్సీగా ఆటోనగర్లలో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించేకుందుకు అవసరమైన గ్రోత్ పాలసీకి కేబినెట్ ఆమోదం లభించింది.
- ధాన్యం కొనుగోళ్లు కోసం… ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ.5వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేబినెట్ అనుమతి.. రైతుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూసేందుకు నిర్ణయం. ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం.
ఇప్పటివరకు 21.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ, 21 రోజుల్లో రైతులకు రూ.2150 కోట్ల చెల్లింపులు జరిగాయి. - విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్ గృహ కల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్ఐజీ, ఎంఐజీ కాలనీలకోసం వాడుకునేందుకు కేబినెట్ ఆమోదం.
- తిరుపతిలో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్కు 5 ఎకరాల స్థలం.. అకాడమీ పెట్టేందుకు స్థలం ఇస్తూ కేబినెట్ నిర్ణయం.
- ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ( రార్స్)కు ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.. రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్(రార్స్)కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్.
- ఎండో మెంట్ చట్టం – 1987 కి సవరణలతో ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం.. దీనిద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి సవరణలు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం.
- ఓటీఎస్ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్కి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ మినహాయింపులకు కేబినెట్ ఆమోదం
- ఐసీడీఎస్కు బాలమృతం, ఫోర్టిఫైడ్ ఆహారం, తాజా పాలు అమూల్ నుంచి సరఫరాకు కేబినెట్ ఆమోద.. ఏపీడీడీసీఎఫ్ ద్వారా సరఫరా చేయనున్న అమూల్.
- మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 7 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
- శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 13 పోస్టులు మంజూరుకు ఆమోదం
- జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, ఉగాది, దీపావళి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకు కేబినెట్ ఆమోదం.
- ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రంలో తాజా వ్యవసాయ పరిస్థితులపై మంత్రివర్గసమావేశంలో చర్చ… వ్యవసాయ అనుబంధ రంగాల్లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జీజీఐ)లో ప్రథమ స్ధానంలో నిల్చిన ఆంధ్రప్రదేశ్.. వ్యవసాయరంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశుసంవర్ధకశాఖలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధి సాధించిన ఏపీ.. దీంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్లో అనుసరించిన వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్మోడల్గా నిల్చిందని కేబినెట్లో వివరించిన అధికారులు.
- ఉద్యానవనశాఖలో అను
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
తాజావార్తలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..