BAC Meeting: 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ..!
- ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు..
- రేపటి నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు అసెంబ్లీ..
- సభలో చర్చించేందుకు 18 అంశాలను ప్రతిపాదించిన టీడీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BAC Meeting: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈరోజు ( సెప్టెంబర్ 18న) శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు.
Read Also: AP Assembly: వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ మంత్రులు
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
అయితే, అసెంబ్లీలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఇవాళ జీఎస్టీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ లు తగ్గించడంతో ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ్టి సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. కేంద్రాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే, రేపు జలవనరుల శాఖపై చర్చ జరపనున్నారు. ఈ నెల 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ సిక్స్ పథకాలు, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30వ తేదీన రాయలసీమ- కోస్తా- ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఇక, ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉన్నాయి. కాగా, ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్ లోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో చర్చించేందుకు 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!