BAC Meeting: 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ..!
- ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు..
- రేపటి నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు అసెంబ్లీ..
- సభలో చర్చించేందుకు 18 అంశాలను ప్రతిపాదించిన టీడీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BAC Meeting: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈరోజు ( సెప్టెంబర్ 18న) శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు.
Read Also: AP Assembly: వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ మంత్రులు
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
అయితే, అసెంబ్లీలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఇవాళ జీఎస్టీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ లు తగ్గించడంతో ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ్టి సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. కేంద్రాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే, రేపు జలవనరుల శాఖపై చర్చ జరపనున్నారు. ఈ నెల 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ సిక్స్ పథకాలు, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30వ తేదీన రాయలసీమ- కోస్తా- ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఇక, ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉన్నాయి. కాగా, ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్ లోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో చర్చించేందుకు 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..