BAC Meeting: 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక అంశాలపై చర్చ..!
- ఈ నెల 30వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు..
- రేపటి నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు అసెంబ్లీ..
- సభలో చర్చించేందుకు 18 అంశాలను ప్రతిపాదించిన టీడీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BAC Meeting: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈరోజు ( సెప్టెంబర్ 18న) శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు.
Read Also: AP Assembly: వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ మంత్రులు
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అయితే, అసెంబ్లీలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించింది. ఇవాళ జీఎస్టీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ లు తగ్గించడంతో ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ్టి సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. కేంద్రాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అలాగే, రేపు జలవనరుల శాఖపై చర్చ జరపనున్నారు. ఈ నెల 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ సిక్స్ పథకాలు, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30వ తేదీన రాయలసీమ- కోస్తా- ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఇక, ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉన్నాయి. కాగా, ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్ లోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసెంబ్లీలో చర్చించేందుకు 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది.
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!