GSI 2023: అతిథుల కోసం ప్రత్యేక వంటకాలు.. ఘుమ ఘుమ లాడే ఆంధ్ర రుచులు
GSI 2023: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.. 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.. సమ్మిట్ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించబోతున్నారు.. ఇప్పటికే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు.. ఈ సమ్మిట్ ద్వారా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలోని మూడు ప్రాంతాలలో ఫేమస్.. వెజ్, నాన్వెజ్ రుచులను వీరికి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు..
Read Also: Global Investors Summit: పారిశ్రామిక వేత్తల చూపు.. విశాఖ వైపు.. నేటి నుంచి జీఐఎస్..
Also Read
- Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ఈ రోజు, రేపు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) జరగనుంది.. అయితే, తొలిరోజు మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్, వెజ్ రకాల్లో మష్రూం, క్యాప్సికం కూర, ఆలూ గార్లిక్ ఫ్రై, కేబేజీ మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర–కార్న్ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్రూట్ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. అలాగే కట్ ఫ్రూట్స్, ఐస్క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలు సిద్ధం చేస్తున్నారు.. ఇక, రెండో రోజు అంటే శనివారం.. లంచ్లో రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్లతో పాటు రుమాలి రోటీ, బటర్ నాన్ ఇస్తారు. నాన్ వెజ్ రకాల్లో ఆంధ్రా చికెన్ కర్రీ, చేప ఫ్రై, గోంగూర, రొయ్యల కూర, ఎగ్ మసాలా, మటన్ పలావ్.. వెజ్ ఐటమ్స్లో వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీరు కూర, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు–క్రీం వంటివి ఉండబోతున్నాయి.. వీటితో పాటు కట్ ఫ్రూట్స్, ఐస్క్రీం, బ్రౌనీ, గులాబ్జామ్, అంగూర్ బాసుంది, డబుల్కా మీఠా ఇస్తారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, టమాటా బాత్, హాట్ పొంగల్, ఉదయం స్నాక్స్లో ప్లమ్ కేక్, డ్రై కేక్, వెజ్ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్ రోల్స్, సాయంత్రం స్నాక్స్లో కుకీస్, చీజ్ బాల్స్, డ్రై ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్, కట్ మిర్చి బజ్జీలు, టీ, కాఫీ ఏర్పాటు చేస్తారు.. మెనుకు అనుగుణంగా.. అన్ని వంటకాలకు అవసరమైన వివిధ పదార్థాలను సిద్ధం చేస్తున్నారు..
ఇక, పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు తరలిరావడంతో.. వారి కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు పరిశ్రమలు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్ సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్కి 35 మంది టాప్ పారిశ్రామిక వేత్తలు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు తరలివచ్చారు.. సమ్మిట్ కోసం 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే.. పారిశ్రామిక వర్గాల నుంచి స్పందన ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!