Disha SOS: దిశ SOS ఎఫెక్ట్.. మిస్సింగ్ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే యువతి గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని సదానగర్ లో నివాసం ఉండే రామకృష్ణ అనే వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.. బాధితుల నుండి వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం యువతి స్నేహితులను, చుట్టుపక్కల వారిని, బంధువులను పోలీసులు విచారించారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక యువకుడి బైక్ పై యువతి వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Seediri Appalaraju: అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్
Also Read
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
యువతిని బైక్ పై తీసుకెళ్లిన యువకుడు ఓం ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. దీంతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. యువతి, యువకులు ఇద్దరు మంగుళూరు దగ్గర ఉన్నట్లు టెక్నికల్ టీం గుర్తించింది. వెంటనే యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి, వీలయినంత త్వరగా అమ్మాయిని అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. తమ కూతురు కనిపించడం లేదని దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే తక్షణం స్పందించిన పోలీసులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మహిళలు మిస్సింగ్ అయినా పోలీసులు అలసత్వం వహించకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గంటల వ్యవధిలోనే మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కనిపెడుతున్నామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రామ్ప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..