Disha SOS: దిశ SOS ఎఫెక్ట్.. మిస్సింగ్ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే యువతి గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని సదానగర్ లో నివాసం ఉండే రామకృష్ణ అనే వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.. బాధితుల నుండి వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం యువతి స్నేహితులను, చుట్టుపక్కల వారిని, బంధువులను పోలీసులు విచారించారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక యువకుడి బైక్ పై యువతి వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Seediri Appalaraju: అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్
Also Read
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
యువతిని బైక్ పై తీసుకెళ్లిన యువకుడు ఓం ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. దీంతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. యువతి, యువకులు ఇద్దరు మంగుళూరు దగ్గర ఉన్నట్లు టెక్నికల్ టీం గుర్తించింది. వెంటనే యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి, వీలయినంత త్వరగా అమ్మాయిని అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. తమ కూతురు కనిపించడం లేదని దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే తక్షణం స్పందించిన పోలీసులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మహిళలు మిస్సింగ్ అయినా పోలీసులు అలసత్వం వహించకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గంటల వ్యవధిలోనే మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కనిపెడుతున్నామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
-
IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
-
Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్పై నాన్-బెయిలబుల్ వారెంట్..
-
Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
-
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!