Disha SOS: దిశ SOS ఎఫెక్ట్.. మిస్సింగ్ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే యువతి గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని సదానగర్ లో నివాసం ఉండే రామకృష్ణ అనే వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.. బాధితుల నుండి వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం యువతి స్నేహితులను, చుట్టుపక్కల వారిని, బంధువులను పోలీసులు విచారించారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక యువకుడి బైక్ పై యువతి వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Seediri Appalaraju: అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
యువతిని బైక్ పై తీసుకెళ్లిన యువకుడు ఓం ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. దీంతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. యువతి, యువకులు ఇద్దరు మంగుళూరు దగ్గర ఉన్నట్లు టెక్నికల్ టీం గుర్తించింది. వెంటనే యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి, వీలయినంత త్వరగా అమ్మాయిని అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. తమ కూతురు కనిపించడం లేదని దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే తక్షణం స్పందించిన పోలీసులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మహిళలు మిస్సింగ్ అయినా పోలీసులు అలసత్వం వహించకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గంటల వ్యవధిలోనే మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కనిపెడుతున్నామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!