Disha SOS: దిశ SOS ఎఫెక్ట్.. మిస్సింగ్ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే యువతి గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని సదానగర్ లో నివాసం ఉండే రామకృష్ణ అనే వ్యక్తి తన కూతురు కనిపించడం లేదని దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు.. బాధితుల నుండి వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం యువతి స్నేహితులను, చుట్టుపక్కల వారిని, బంధువులను పోలీసులు విచారించారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక యువకుడి బైక్ పై యువతి వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Seediri Appalaraju: అచ్చెన్నాయుడుకి బ్రైన్ సైజ్ ఫుల్.. ఫంక్షనింగ్ నిల్
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
యువతిని బైక్ పై తీసుకెళ్లిన యువకుడు ఓం ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. దీంతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు. యువతి, యువకులు ఇద్దరు మంగుళూరు దగ్గర ఉన్నట్లు టెక్నికల్ టీం గుర్తించింది. వెంటనే యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి, వీలయినంత త్వరగా అమ్మాయిని అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. తమ కూతురు కనిపించడం లేదని దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే తక్షణం స్పందించిన పోలీసులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ మహిళలు మిస్సింగ్ అయినా పోలీసులు అలసత్వం వహించకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గంటల వ్యవధిలోనే మిస్సింగ్ అయిన వారి ఆచూకీ కనిపెడుతున్నామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!