JC Prabhakar Reddy: రోడ్లపై చెత్త వేస్తే కేసులు.. పరిశ్రమలకు కరెంట్ కట్.. జేసీ వార్నింగ్
- తాడిపత్రి అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తప్పవన్న జేసీ..
- ప్రజలు.. బంధువులు.. స్నేహితులు సహకరించాలని విజ్ఞప్తి..
- రోడ్లపై చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్..
- పరిశ్రమలు వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే కరెంటు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ప్రజలు తమ బంధువులు.. స్నేహితులు సహకరించాలని చేతులు జోడించి విన్నవించారు. ఇక, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. నందలపాడు, సజ్జలదిన్నె పారిశ్రామిక వాడల్లో ఉన్న నల్ల బండలలో పాలిష్ వృథా రాళ్లు రోడ్ల పక్కన వేస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.
Read Also: ICMR Report: సమోసా, చిప్స్, కేక్స్ వల్లే దేశంలో షుగర్ వ్యాధి విస్తరిస్తోంది.. షాకింగ్ రిపోర్ట్
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
ఇక, తాడిపత్రి అభివృద్ధి చెందిందంటే పరిశ్రమల వల్లే సాధ్యమైందన్నారు జేసీ… పరిశ్రమలు స్థాపించిన యజమానులు అందరూ బాగా చదువుకున్న వారేనని.. పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే పరిశ్రమలకు కరెంటు బంద్ చేయిస్తామని స్పష్టం చేశారు.. తాడిపత్రి అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పారిశ్రామిక వాడల చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రానైట్ నల్లబండల వృథా రాళ్లు ఎక్కడపడితే అక్కడ వదిలేసేవాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ లోపు తాడిపత్రి పట్టణమంతా శుభ్రంగా ఉంచాలన్నారు.. ఆయా ప్లాట్ల మధ్యలో రోడ్లు వేస్తానని.. నష్టపోకుండా ఫ్లాట్ల యజమానులు చూసుకోవాలన్నారు. మరోవైపు.. ట్రాక్టర్లు విడిపించుకోవడానికి తన బంధువులు.. స్నేహితులు.. పార్టీ నాయకుడు ఎవరు తన వద్దకు రావద్దని చేతులు జోడించి విన్నవించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..