JC Prabhakar Reddy: ఇదే లాస్ట్ దీపావళి అంటే మేం చూస్తూ ఊరుకోవాలా..? మేం మొదలు పెడితే తట్టుకోలేరు.. జేసీ వార్నింగ్..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వార్నింగ్..
- కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు..
- ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..?..
- మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి.. ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి.. మీరు ఇలా ఉన్నారంటూ హెచ్చరించారు.. వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు.. అంటే.. ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.. మాట్లాడేటప్పుడు ఒక సారి ఆలోచించి మాట్లాడండి అని హితవు చెప్పారు.. నీకు భవిష్యత్తు చాలా వుంది దానిని నాశనం చేసుకోకు అని సూచించారు.. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మంచి వాడు కాబట్టే.. మీరు ఇలా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు జేసీ.
Read Also: Tamil Nadu Rain: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేను మూడేళ్లే ఉంటానని పెద్దారెడ్డి చెబుతున్నాడు.. దేవుని ఆశిస్సులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్న ఆయన.. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిన్నవాడు.. ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి.. మళ్లీ అవకాశం ఉండొచ్చు.. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని పేర్కొన్నారు.. మరోవైపు, అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఏమైంది..? దానిపై గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.. సెంట్రల్ రైలు సర్వీసులు ప్రైవేటీకరణ చేయలేదా..? ప్రభుత్వం ఎన్నో సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదా? అని ప్రశ్నించారు.. అసలు, వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏమి చేస్తున్నారు..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు జేసీ.. చివరకు నేను కూడా తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నానని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి..
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!