JC Prabhakar Reddy Apologies: వారికి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. హాట్ టాపిక్..!
- జెసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరాడు..
- ఫ్లైయాష్ వివాదంలో నాటకీయ పరిణామాలు..
- అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జేసీ క్షమాపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy Apologies: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడైనా తగ్గేదేలే అనే తరహాలో వ్యవహరిస్తుంటారు.. కానీ, ఉన్నట్టుండి ఆయన యూ టర్న్ తీసుకున్నారు.. తన సహజశైలికి భిన్నంగా క్షమాపణలు కోరారు.. నమ్మశక్యంగా లేదు.. కానీ, ఇది నిజం.. ఆర్టీపీపీ వద్ద గత నెల 27 వ తేదీన ఫ్లై యాష్ వివాదం కొనసాగుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి వివాదానికి కారణమైన ఇరువురు నాయకులను హెచ్చరించిన మార్పు రాలేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య మొదల్తెన ఫ్లై యాష్ వివాదంతో గత నెల రోజులుగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.. ఫ్లై యాష్ లోడింగ్ చేయకపోవడంతో నెల రోజులుగా జేసీ వర్గీయులకు చెందిన ఉన్న లారీలు అక్కడే ఆగిపోయాయి. ఈ వివాదంపై ఉన్నతాధికారులకు ఎన్ని లేఖలు పంపినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న వివాదంలో వాస్తవాలను అధికారులు ఎందుకు పట్టించుకోవలేదన్నారు.
Read Also: Air Travel: విమాన ప్రయాణికులకు అలర్ట్.. లగేజ్ బరువు, పరిమితిపై కొత్త నిబంధనలు..
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
ఇక, ఈ నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతున్నాని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.. తన వాళ్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. గత ఐదేళ్లు చాలా నష్టపోయానని.. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు.. నియోజకవర్గ ప్రజల కోసమే తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి వచ్చిన సమయంలో.. ఒకటి సరెండర్ కావాలి.. లేదా ఊరు విడిచి వెళ్తారని అనుకున్నారు.. కానీ, అలాంటి సమయంలో నియోజకవర్గంలో ప్రజలు నా వెంటనడిచడంతో పోరాటం చేశానని తెలిపారు.
Read Also: Lava Yuva 2 5G: చెప్పిన తేదీకి ముందే మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్ ఫోన్
గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు జేసీ. మా డీఎన్ఏ డిఫరెంట్ అని.. డబ్బులకు మమల్ని లొంగదీసుకోలేరని అన్నారు. నా పొగురు, ఫ్రిస్టేజ్ వళ్ల అన్నీ పొగొట్టుకున్నానని.. గత ఐదేళ్లు చాలా నష్టపోయాన్నారు. నాకు డబ్బు అన్నీ ఉన్నాయని.. కానీ, డబ్బు కోసం పాలిటిక్స్ లో వచ్చానని అనడం సరైంది కాదన్నారు. ఫ్లై యాష్ (బూడిద) విషయంలో డబ్బులు కోసం అంటున్నారని.. కానీ, అది నా ఫ్రిస్టేజ్ కోసమే అంతా చేశానన్నారు. వైసీపీ వాళ్లకు లొంగిపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని.. కానీ, చంద్రబాబు పై నమ్మకంతో ఆయన వెంట నడిచానని పరోక్షంగా వ్యాఖ్యనించారు. అయితే, నెల రోజులుగా నడుస్తున్న వివాదానికి ముగింపు పలకడానికే జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!