JC Prabhakar Reddy Apologies: వారికి క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. హాట్ టాపిక్..!
- జెసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరాడు..
- ఫ్లైయాష్ వివాదంలో నాటకీయ పరిణామాలు..
- అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జేసీ క్షమాపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy Apologies: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎప్పుడైనా తగ్గేదేలే అనే తరహాలో వ్యవహరిస్తుంటారు.. కానీ, ఉన్నట్టుండి ఆయన యూ టర్న్ తీసుకున్నారు.. తన సహజశైలికి భిన్నంగా క్షమాపణలు కోరారు.. నమ్మశక్యంగా లేదు.. కానీ, ఇది నిజం.. ఆర్టీపీపీ వద్ద గత నెల 27 వ తేదీన ఫ్లై యాష్ వివాదం కొనసాగుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి వివాదానికి కారణమైన ఇరువురు నాయకులను హెచ్చరించిన మార్పు రాలేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య మొదల్తెన ఫ్లై యాష్ వివాదంతో గత నెల రోజులుగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.. ఫ్లై యాష్ లోడింగ్ చేయకపోవడంతో నెల రోజులుగా జేసీ వర్గీయులకు చెందిన ఉన్న లారీలు అక్కడే ఆగిపోయాయి. ఈ వివాదంపై ఉన్నతాధికారులకు ఎన్ని లేఖలు పంపినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న వివాదంలో వాస్తవాలను అధికారులు ఎందుకు పట్టించుకోవలేదన్నారు.
Read Also: Air Travel: విమాన ప్రయాణికులకు అలర్ట్.. లగేజ్ బరువు, పరిమితిపై కొత్త నిబంధనలు..
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
ఇక, ఈ నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతున్నాని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.. తన వాళ్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. గత ఐదేళ్లు చాలా నష్టపోయానని.. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు.. నియోజకవర్గ ప్రజల కోసమే తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి వచ్చిన సమయంలో.. ఒకటి సరెండర్ కావాలి.. లేదా ఊరు విడిచి వెళ్తారని అనుకున్నారు.. కానీ, అలాంటి సమయంలో నియోజకవర్గంలో ప్రజలు నా వెంటనడిచడంతో పోరాటం చేశానని తెలిపారు.
Read Also: Lava Yuva 2 5G: చెప్పిన తేదీకి ముందే మార్కెట్లోకి వచ్చేసిన లావా స్మార్ట్ ఫోన్
గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేశారు జేసీ. మా డీఎన్ఏ డిఫరెంట్ అని.. డబ్బులకు మమల్ని లొంగదీసుకోలేరని అన్నారు. నా పొగురు, ఫ్రిస్టేజ్ వళ్ల అన్నీ పొగొట్టుకున్నానని.. గత ఐదేళ్లు చాలా నష్టపోయాన్నారు. నాకు డబ్బు అన్నీ ఉన్నాయని.. కానీ, డబ్బు కోసం పాలిటిక్స్ లో వచ్చానని అనడం సరైంది కాదన్నారు. ఫ్లై యాష్ (బూడిద) విషయంలో డబ్బులు కోసం అంటున్నారని.. కానీ, అది నా ఫ్రిస్టేజ్ కోసమే అంతా చేశానన్నారు. వైసీపీ వాళ్లకు లొంగిపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని.. కానీ, చంద్రబాబు పై నమ్మకంతో ఆయన వెంట నడిచానని పరోక్షంగా వ్యాఖ్యనించారు. అయితే, నెల రోజులుగా నడుస్తున్న వివాదానికి ముగింపు పలకడానికే జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!