Anam vs Nedurumalli : ఎమ్మెల్యే ఆనంకి రాంకుమార్ రెడ్డి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా వుంటాయి. తాజాగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో సుదీర్ఘ ప్రస్తావన చేశారు. సలహా మండలిలో జిల్లా ఏర్పాటు లో అభ్యంతరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఆనం వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాంకుమార్ రెడ్డి.
విభజన వల్ల సోమశిల ప్రాజెక్టు నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు ఆనం. రాష్ట్ర విభజన ప్రక్రియ తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కొట్టుకున్నట్లు అవుతుంది. జిల్లా విభజన సమయంలో నీటి లెక్కలు తేల్చాలి.. లేకుంటే భవిష్యత్తు ఇబ్బంది తప్పదన్నారు. పంటల కొనుగోళ్లకూ ఇబ్బందులు వుంటాయన్నారు. పాలనా పరమైన అంశాలలోనూ ఇబ్బందులు వస్తాయన్నారు. వద్దు..వద్దూ..అంటున్న కందుకూరు నెల్లూరు లో కలిపారు. సహేతుక కారణాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారే పరిష్కరించాలి. విభజన ప్రక్రియ గందర గోళంగా ఉంది. సున్నితమైన అంశాలను జఠిలం చేయొద్దు. డీలిమిటేషన్ విషయంలో హడావిడి నిర్ణయాలు తీసుకుంటే విద్వేషాలు పెరుగుతాయి. రాష్ట్ర విభజన విషయంలో కొన్ని సంఘటనలు చూశాం..
జిల్లాల విభజనపై అవగాహనా సదస్సు లు నిర్వహించండి.. ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోండి అని కామెంట్ చేశారు ఆనం రామనారాయణరెడ్డి.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
దీనిపై తీవ్రంగా స్పందించారు వైసీపీ నాయకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆనం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి లేకుంటే మీకు రాజకీయ భవిష్యత్ లేదు. ఆనం ఫ్యామిలీని తొక్కాలి అనుకుంటే మా నాన్న జనార్ధన్ రెడ్డి హయాంలోనే ఎప్పుడో పక్కన పెట్టేవాడన్నారు. నీ అజెండా ఏంటో అందరికీ తెలుసు నీతి మాలిన రాజకీయాలు చెయ్యకండి. బాలాజీ జిల్లాకి వెంకటగిరి ప్రజలు ఎక్కడా వ్యతిరేకంగా లేరు. రాపూరు కి ఎమ్మెల్యే గా ఉన్నారు గా ఏమాత్రం అభివృద్ధి చేశారో చెప్పండి. ప్రతిపక్షాలు కూడా స్వాగతించారు మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో అందరికి తెలుసన్నారు రాంకుమార్ రెడ్డి. మొత్తం మీద ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!