Anam vs Nedurumalli : ఎమ్మెల్యే ఆనంకి రాంకుమార్ రెడ్డి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా వుంటాయి. తాజాగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో సుదీర్ఘ ప్రస్తావన చేశారు. సలహా మండలిలో జిల్లా ఏర్పాటు లో అభ్యంతరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఆనం వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాంకుమార్ రెడ్డి.
విభజన వల్ల సోమశిల ప్రాజెక్టు నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు ఆనం. రాష్ట్ర విభజన ప్రక్రియ తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కొట్టుకున్నట్లు అవుతుంది. జిల్లా విభజన సమయంలో నీటి లెక్కలు తేల్చాలి.. లేకుంటే భవిష్యత్తు ఇబ్బంది తప్పదన్నారు. పంటల కొనుగోళ్లకూ ఇబ్బందులు వుంటాయన్నారు. పాలనా పరమైన అంశాలలోనూ ఇబ్బందులు వస్తాయన్నారు. వద్దు..వద్దూ..అంటున్న కందుకూరు నెల్లూరు లో కలిపారు. సహేతుక కారణాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారే పరిష్కరించాలి. విభజన ప్రక్రియ గందర గోళంగా ఉంది. సున్నితమైన అంశాలను జఠిలం చేయొద్దు. డీలిమిటేషన్ విషయంలో హడావిడి నిర్ణయాలు తీసుకుంటే విద్వేషాలు పెరుగుతాయి. రాష్ట్ర విభజన విషయంలో కొన్ని సంఘటనలు చూశాం..
జిల్లాల విభజనపై అవగాహనా సదస్సు లు నిర్వహించండి.. ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోండి అని కామెంట్ చేశారు ఆనం రామనారాయణరెడ్డి.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
దీనిపై తీవ్రంగా స్పందించారు వైసీపీ నాయకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. ఆనం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి లేకుంటే మీకు రాజకీయ భవిష్యత్ లేదు. ఆనం ఫ్యామిలీని తొక్కాలి అనుకుంటే మా నాన్న జనార్ధన్ రెడ్డి హయాంలోనే ఎప్పుడో పక్కన పెట్టేవాడన్నారు. నీ అజెండా ఏంటో అందరికీ తెలుసు నీతి మాలిన రాజకీయాలు చెయ్యకండి. బాలాజీ జిల్లాకి వెంకటగిరి ప్రజలు ఎక్కడా వ్యతిరేకంగా లేరు. రాపూరు కి ఎమ్మెల్యే గా ఉన్నారు గా ఏమాత్రం అభివృద్ధి చేశారో చెప్పండి. ప్రతిపక్షాలు కూడా స్వాగతించారు మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో అందరికి తెలుసన్నారు రాంకుమార్ రెడ్డి. మొత్తం మీద ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!