Son Kills Mother: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటుచేసుకుంది.. నాతవరం మండలం, వైబీపట్నం గ్రామంలో తల్లిన హత్య చేసిన కొడుకు ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిటికెల మంగ (56) కొడుకు రామ్మూర్తినాయుడు మధ్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో తరచూ ఆస్తి పంచాలని తల్లిని వేధించసాగాడు. దీనికి అడ్డు చెప్పిన తల్లిని ఇబ్బందులు గురిచేసేవాడు.
US: డల్లాస్లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
ఈ పరిస్థితుల్లో తెల్లవారుజామున ఇదే విషమయై ఇద్దరి మధ్య మరోసారి వివాదం జరిగింది. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పూల కుండీతో తల్లి మంగ తలపై బలంగా మోదగా, ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. దీనిపై స్థానికులిచ్చిన సమాచారం మేరకు డీఎస్సీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు అధికారులు.
Tadipatri: తాడిపత్రిలో మరోమారు టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసు బందోబస్తు!
