TDP vs YSRCP in Vinayaka Chavithi: వినాయక చవితి వేడుకల్లో వివాదం.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ..
- వినాయక చవితి వేడుకల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ..
- అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో ఘటన..
- రామాలయం గణేష్ పూజల విషయంలో వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs YSRCP in Vinayaka Chavithi: వినాయక చవితి వేడుకల్లో వివాదం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.. అనకాపల్లి జిల్లా పరవాడలోని వెన్నెలపాలెం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం మొదలైంది.. పరవాడ మండలం, మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం.. అయితే వెన్నెలపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.. చవితి ఉత్సవాల్లో భాగంగా పంచాయితీకి సంబంధించిన వినాయక విగ్రహం పెట్టేందుకు స్థానిక రామాలయం దగ్గర ఇరువర్గాల మధ్య ఘర్షణ స్టార్ట్ అయ్యింది.. గత రెండు రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.. రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు గ్రామపంచాయతీలో ఉన్న రామాలయానికి తాళం వేశారు.. అయితే, తర్వాత రోజు టీడీపీ వాళ్లు కూడా రామాలయానికి తాళం వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
Read Also: Mahindra University: మహేంద్ర యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో నలుగురు అరెస్టు..
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
ఈ రోజు వినాయక చవితి కావడంతో ఇరు వర్గాల నాయకులు రామాలయం దగ్గరకు చేరుకున్నారు.. దీంతో, ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి.. విషయం తెలుసుకున్న పరవాడ పోలీసులు రంగప్రవేశం చేశారు.. పరవాడ సీఐ మల్లికార్జున రావు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు.. టిడిపి నాయకులను, వైసీపీ నాయకులను ఇరువర్గాలకు నచ్చజెప్పి.. మొదటగా వినాయకుని మండపానికి పర్మిషన్ తీసుకున్నవాళ్లే రామాలయంలో పూజ చేసుకోవచ్చని సీఐ తెలిపారు.. కానీ, వెన్నెలపాలెం వైసీపీ సర్పంచ్ కి మాత్రం మండపాలు పర్మిషన్ అవసరం లేదని వాదనకు దిగాడు సర్పంచ్.. అయితే, సర్పంచ్ అయినా సరే పర్మిషన్ తీసుకోవాలని పరవాడ సీఐ తేల్చి చెప్పారు.. చివరికి టీడీపీ వాళ్లు పర్మిషన్ ముందుగా తీసుకోవడంతో రామాలయంలో టీడీపీ నాయకులు వినాయకునికి మొదటగా పూజలు చేశారు..
తాజావార్తలు
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..