Andhra Pradesh Deputy CM Amzath Basha about AP Cabinet Expansion.
ఏపీ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్తీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఎన్టీవితో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం నాకు శిరోధార్యం అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మైనారిటీ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే గొప్ప అదృష్టం గా భావిస్తున్నాని ఆయన అన్నారు. సీఎం ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తానని, పార్టీకోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
అప్పుడూ పదవులు కావాలని అడగలేదు.. ఇపుడు మళ్ళీ కావాలని అడగలేదు.. సీఎం జగన్మోహన్ రెడ్డి కి అన్నీ తెలుసు అని ఆయన వెల్లడించారు. ఎవరికి ఏమి ఇవ్వాలో, వారికి ఏ బాధ్యతలు అప్పగించాలో ఆలోచించే ఆయన నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. మంత్రి వర్గాన్ని విస్తరించడంలో సీఎం జగన్ పూర్తి అవగాహనతోనే ముందుక వెళ్తారని, ఆయన నిర్ణయానికి మేం విధేయులుగానే ఉంటామన్నారు.