Vijayendra Prasad Visits Dhokka Seethamma House: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని అపర్ణ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత-దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఉన్న డొక్కా సీతమ్మ ఇంటిని విజయేంద్ర ప్రసాద్ సందర్శించి, ఆమె వాడిన వస్తువులను పరిశీలించారు. సీతమ్మ చేసిన సేవలను తెలుసుకొని, ఆమెకు నివాళులు అర్పించారు.
Read Also: Brian Bennett: క్యాచ్ ను అలా.. ఎలా? పట్టేశావ్ బ్రో.. వీడియో వైరల్
“మహాతల్లి సీతమ్మ.. నా జన్మ ధన్యం”
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎప్పటి నుండో మహాతల్లి సీతమ్మ ఇంటికి రావాలనుకున్నాను.. ఇప్పుడు ఆమె ఇంటికి రావడంతో నా జన్మ ధన్యమైందన్నారు.. అలాగే, సీతమ్మ పేరుతో ఏ కార్యక్రమం చేపట్టినా.. తన సహాయ సహకారం అందిస్తానని కూడా చెప్పారు. ఇక, మహాతల్లి పేరు మీద సంవత్సరానికో, నెలకో ఒక్కరికైనా భోజనం పెట్టాలని నా ఆశ. నేను తీసే సినిమాల్లో సీతమ్మ పాత్రను పెట్టాలని నా మదిలో మెదిలింది అన్నారు.. మరోవైపు, ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ, డొక్కా సీతమ్మ వారసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
