Ambati Rambabu: జీవీఎల్ ప్రకటనపై చర్చ జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మళ్ళీ ప్రత్యేక హోదా రచ్చ ప్రారంభమయింది. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగించింది కేంద్ర హోంశాఖ. తొలుత ప్రత్యేక హోదా, రిసోర్స్ గ్యాప్ అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ. తర్వాత వాటిని తొలగించడం వివాదాస్పదం అవుతోంది. ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా ఎందుకు మారింది?త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని జీవీఎల్ ప్రకటన చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఏపీకి అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావిడి పడ్డారు?జీవీఎల్ వివరణ ఇవ్వాలి. ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని టీడీపీ ఎందుకు స్వాగతించలేదు?
Also Read
సుజనా చౌదరి, సీఎం రమేష్లు చంద్రబాబు ఆదేశాలతో ఎజెండాను మార్పించారని స్పష్టమవుతోంది. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్ గ్యాప్ అంశాలను త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా అన్నారు అంబటి.
మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు? ఆ కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదని జీవీఎల్ రంగంలోకి ఎందుకు దిగారు? చంద్రబాబు, ఆయన పంపించిన వ్యక్తుల శకుని పాత్రపై, పరిధి దాటిన జీవీఎల్ ప్రకటన పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..