Ambati Rambabu: ఆ వెన్నుపోటు రక్తపు మరకల్ని తుడిచే ప్రయత్నం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu Comments On Chandrababu Unstoppable Show: బాలయ్య అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, చంద్రబాబు బావ బావమరుదులు అయితే.. లోకేష్, బాలకృష్ణ మామా అల్లుళ్ళని.. ఒక బంధువర్గం కూర్చుని ఆ షోలో మాట్లాడుకున్నారని అన్నారు. 27 ఏళ్ళ కిందట చేసిన వెన్నుపోటు రక్తపు మరకలను బావ, బావమరుదులు కలిసి తుడిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా హాజరుకాని టాక్ షోకు చంద్రబాబు ఎందుకు హాజరయ్యారో, అది ఆయనకు రాజకీయంగా ఎంతవరకు పనికొస్తుందో ఆయనకే తెలియలన్నారు. పోగాలం దాపురించటంతోనే తన కుమారుడితో కలిసి చంద్రబాబు ఆ టాక్ షోలో హాజరయ్యారన్నారు.
‘మూడు గంటలు కాళ్ళు పట్టుకుని బతిమాలినా ఒప్పుకోలేదు.. అందుకే జుట్టు పట్టుకుని లాగేశాను’ అనే విధంగా చంద్రబాబు మాట్లాడటం చాలా ఘోరమని అంబటి రాంబాబు అన్నారు. ఈ చర్చ ద్వారా వెన్నుపోటు ఎలా జరిగిందో ఈ తరం వాళ్ళకు తెలిసేలా ‘ఆహా’ వాళ్లు చేశారన్నారు. బాలకృష్ణ తానా అంటే తందానా అంటున్నాడని ఎద్దేవా చేశారు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్పై చెప్పులు వేయటం సమంజసమేనని బాలయ్య చెప్పడం దౌర్భాగ్యమన్నారు. ఎన్టీఆర్ మరణించి ఉండకపోతే మీ బతుకు ఏమై ఉండేదని ప్రశ్నించారు. మీ స్నేహితుడు ఎవరని అడిగితే.. రాజశేఖరరెడ్డి, తాను కలిసి తిరిగే వాళ్లమని చంద్రబాబు చెప్పారన్నారు. మరి.. రాజశేఖరరెడ్డి వెంట తిరుగుతూ ఖర్చుల కోసం చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడని, ఆ విషయాన్ని చంద్రబాబు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. రాజశేఖరరెడ్డి కుటుంబం అప్పటికే ధనవంతులని పేర్కొన్నారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఈ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి సహా నాదెండ్ల భాస్కర్ని కూడా పిలిచి ఉంటే బాగుండేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ పతనం అన్స్టాపబుల్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు వైసీపీ సాధించటం అన్స్టాపబుల్ అని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు అసెంబ్లీకి హాజరుకాడు కానీ బాలయ్య టాక్ షోకి హాజరవుతాడని విమర్శించారు. ఈ స్థాయికి దిగజారిన తర్వాత ఏం మాట్లాడతామని నిలదీశారు. లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడంలో లాజిక్ ఉందన్నారు. ఇంత మంది పిల్లలున్నా.. ఒక్కరైనా ఎన్టీఆర్కు కనీసం మంచి నీళ్ళు అయినా ఇచ్చారా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!