Amarnath Yatra: అమర్ నాథ్లో సహాయకచర్యలు.. ఆ ఏపీ వాసులు సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమర్ నాథ్ గుహ సమీపంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు అనేకమంది భక్తులు కొట్టుకుపోయారు. అందులో కొందరి ఆచూకీ ఇంత వరకు లభించలేదు. గల్లంతైన 40 మందిని గుర్తించేందుకు శనివారం రాత్రి కూడా సహాయక చర్యలు కొనసాగాయి. శుక్రవారం గుహ సమీపంలో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వరద రావడం, ఆ మార్గంలో వెళుతున్న భక్తులు కొట్టుకుపోయారు. అక్కడి పరిస్థితిని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా ఇప్పటికే 16 మంది మరణించగా, 105 మంది గాయపడ్డారు.
దీనిపై అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. సుమారు 15 వేలకు పైగా భక్తులను పంజ్ తార్ని లోని లోయర్ బేస్ క్యాంప్ కు తరలించింది. బురద, రాళ్ల శిధిలాల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారన్న ఆందోళనలతో.. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అక్కడి తాజా పరిస్థితిని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్షించారు. గాయపడిన వారిని హెలికాప్టర్లతో శ్రీనగర్ లోని స్కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ఇదిలా వుంటే.. అమర్ నాధ్ యాత్రలో మిస్సైన వారిలో విజయవాడకు చెందిన వినోద్ అశోక్ సురక్షితంగా వున్నారు. తాను సురక్షితంగానే ఉన్నానని ఏపీ భవన్ అధికారులకు సమాచారమిచ్చాడు వినోద్. ప్రస్తుతం వైష్ణోదేవీ ఆలయం సమీపంలోని కాట్రా వద్ద ఉన్న వినోద్ తమ క్షేమ సమాచారం అందించారు. ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో నిన్న ఎవరినీ కాంటాక్ట్ చేయలేకపోయానని వినోద్ తెలిపారు. ఇటు గుంటూరు నుంచి అమరనాథ్ యాత్రలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీ సురక్షితంగా వున్నారు. విజయవాడ నుంచి వచ్చిన 34 మంది అమర్నాథ్ యాత్రికుల బృందం క్షేమంగా వుందని ఢిల్లీలోని ఏపీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కాట్రా వద్ద సురక్షితంగా ఉన్న 34 మంది విజయవాడకు చెందిన యాత్రికుల సమాచారం వారు తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు చండీఘర్ నుంచి రైలులో విజయవాడ కు బయల్దేరనున్నారు 34 మంది యాత్రికులు. ఈ యాత్రికులకు ప్రయాణ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!