YSRCP Rythu Poru: మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ.. 9న ‘అన్నదాత పోరు’
- ఈనెల 9వ తేదీన వైసీపీ 'అన్నదాత పోరు'..
- యూరియా కొరత, రైతాంగ సమస్యలపై ఆందోళనలు..
- ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు..
- 'అన్నదాత పోరు' పోస్టర్ని విడుదల చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Rythu Poru: మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ ‘అన్నదాత పోరు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. ‘అన్నదాత పోరు’ పోస్టర్ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఈ నెల తొమ్మిదవ తేదీన రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు..
Read Also: Tihar Jail: తీహార్ జైల్లో ఎంపీ రషీద్పై దాడి.. రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
రైతులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది.. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటి పోయింది అని మండిపడ్డారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలలో జగన్ చేసిన అభివృద్ధిని విధ్వంసం చేసింది కూటమి సర్కార్ అని విమర్శించారు.. అరాచకం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు.. రాష్ట్రంలో మాఫియా ముఠాలు నడుస్తున్నాయి.. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు దొరకడం లేదు.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.. ఎరువుల కొరత లేదని ప్రభుత్వం చెబుతుంది.. రైతులు మాత్రం క్యూ లైన్లో నిలబడి ఉంటున్నారు. ఎరువుల అక్రమ నిలువలు ఉంచి.. టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు.. మాఫియా రాజ్యం నడుస్తుందన్నారు.. రైతులు రైతుల్లా ఉండండి.. రాజకీయాలు చేస్తే బొక్కలో వేస్తానని బెదిరిస్తున్నారు. రైతులకు మద్దతు ధర లేదు.. జగన్ వెళ్ళగానే కేంద్రానికి ఒక లేఖ రాస్తున్నారు. కానీ, రైతులు, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని పేర్కొన్నారు.
Read Also: Asia Cup 2025: దుబాయ్ చేరుకున్న భారత జట్టు.. హార్దిక్ పాండ్యా న్యూ లుక్ వైరల్..
యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.. రైతులు అంటే ఏమి తెలియదు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు సజ్జల.. నియంతలు కూడా చంద్రబాబు లాగా వ్యవహరించలేదు.. చంద్రబాబుకి అధికారం విలువ తెలియదు.. ప్రజల పట్ల బాధ్యత లేదు అని ఫైర్ అయ్యారు. యూరియా కొరత పై శాంతియుత ర్యాలీలు తొమ్మిదో తేదీ జరుగుతాయి. సంక్షోభం వస్తే చంద్రబాబుకి ఆదాయం వస్తుంది. చంద్రబాబు, ఆయన కోఠరి ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?