YSRCP Rythu Poru: మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ.. 9న ‘అన్నదాత పోరు’
- ఈనెల 9వ తేదీన వైసీపీ 'అన్నదాత పోరు'..
- యూరియా కొరత, రైతాంగ సమస్యలపై ఆందోళనలు..
- ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు..
- 'అన్నదాత పోరు' పోస్టర్ని విడుదల చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Rythu Poru: మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ ‘అన్నదాత పోరు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. ‘అన్నదాత పోరు’ పోస్టర్ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఈ నెల తొమ్మిదవ తేదీన రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు..
Read Also: Tihar Jail: తీహార్ జైల్లో ఎంపీ రషీద్పై దాడి.. రక్షణ కల్పించాలని కేంద్రానికి కుటుంబం విజ్ఞప్తి
Also Read
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
రైతులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది.. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటి పోయింది అని మండిపడ్డారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలలలో జగన్ చేసిన అభివృద్ధిని విధ్వంసం చేసింది కూటమి సర్కార్ అని విమర్శించారు.. అరాచకం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు.. రాష్ట్రంలో మాఫియా ముఠాలు నడుస్తున్నాయి.. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు దొరకడం లేదు.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.. ఎరువుల కొరత లేదని ప్రభుత్వం చెబుతుంది.. రైతులు మాత్రం క్యూ లైన్లో నిలబడి ఉంటున్నారు. ఎరువుల అక్రమ నిలువలు ఉంచి.. టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు.. మాఫియా రాజ్యం నడుస్తుందన్నారు.. రైతులు రైతుల్లా ఉండండి.. రాజకీయాలు చేస్తే బొక్కలో వేస్తానని బెదిరిస్తున్నారు. రైతులకు మద్దతు ధర లేదు.. జగన్ వెళ్ళగానే కేంద్రానికి ఒక లేఖ రాస్తున్నారు. కానీ, రైతులు, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని పేర్కొన్నారు.
Read Also: Asia Cup 2025: దుబాయ్ చేరుకున్న భారత జట్టు.. హార్దిక్ పాండ్యా న్యూ లుక్ వైరల్..
యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.. రైతులు అంటే ఏమి తెలియదు అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు సజ్జల.. నియంతలు కూడా చంద్రబాబు లాగా వ్యవహరించలేదు.. చంద్రబాబుకి అధికారం విలువ తెలియదు.. ప్రజల పట్ల బాధ్యత లేదు అని ఫైర్ అయ్యారు. యూరియా కొరత పై శాంతియుత ర్యాలీలు తొమ్మిదో తేదీ జరుగుతాయి. సంక్షోభం వస్తే చంద్రబాబుకి ఆదాయం వస్తుంది. చంద్రబాబు, ఆయన కోఠరి ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!