YSRCP MLCs: ఇక, సీఎం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తాం..
- మండలి విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీల చిట్ చాట్..
- ఇక నుంచి సీఎం, మంత్రులను పలాన నియోజకవర్గ ఎమ్మెల్యేగా సంబోధిస్తాం..
- కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు.. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MLCs: ఇక, ముఖ్యమంత్రి, మంత్రులను వారు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తాం అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు.. మండలి విరామ సమయంలో చిట్ చాట్లో వైసీపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అని కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సంబోధిస్తున్నారు.. ఇక, నుంచి మా పంథా కూడా మారుతుంది.. ఇక నుంచి శాసనమండలిలో సీఎం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తాం అన్నారు.. ఇకపై.. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని సంబోధిస్తాం.. ఇలాగే సభలో మాట్లాడతామని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు..
Read Also: OG: ఓజీ మూవీ ప్రీమియర్స్లో..స్క్రీన్ను చింపి అభిమానుల రచ్చ..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ.. కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో తీవ్ర దుమారాన్ని రేపాయి.. రమేష్ యాదవ్.. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మంత్రులు.. అయితే, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నామని చెప్పుకొచ్చారు వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదని తెలిపారు.. ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ ను టీడీపీ వాళ్లు అనేక సార్లు పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు బొత్స.. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు.. అంతేకాదు, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ప్యానెల్ చైర్మన్తో వాగ్వివాదానికి దిగారు మంత్రులు.. రమేష్ యాదవ్ ప్రసంగం కొనసాగడానికి వీలు లేదని అడ్డుకున్నారు మంత్రులు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది.. ఇక, సభలో రికార్డుల పరిశీలన కోసం ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు శాసన మండలి చైర్మన్.. ఆ తర్వాత చిట్చాట్లో ఇకపై సీఎం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధిస్తామని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు..
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!