YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Padayatra Completes 23 Years: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన ట్వీట్లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్ర చరిత్రను తిరగరాసిన పాదయాత్ర” అంటూ పేర్కొన్న జగన్, ఒక నాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను, ప్రజల జీవితాలను ఎలా మార్చగలదో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరూపించారని అన్నారు. 2003 ఏప్రిల్ 9న ఎండలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ప్రారంభమైన ఆ పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని గుర్తుచేశారు.
Read Also: RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు “నేనున్నాను” అనే భరోసా కలిగిందని, రాష్ట్ర ప్రజలు భారీగా మద్దతు ఇచ్చి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసి రైతులకు ఉపశమనం కల్పించారని పేర్కొన్నారు వైఎస్ జగన్.. అంతేకాక, వైఎస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని జగన్ అన్నారు. రైతులను బలోపేతం చేయడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం వంటి చర్యలు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చాయని చెప్పారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆయన చేసిన సంస్కరణలు అనేక మంది పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు కావడానికి దోహదపడ్డాయని వివరించారు జగన్. అలాగే సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి అయిన Polavaram Project పనులకు వేగం తీసుకువచ్చారని తెలిపారు. తన తండ్రి వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్న జగన్, ఆ పాదయాత్ర స్ఫూర్తితో తన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన… pic.twitter.com/B8HvVZwFah
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2026
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?