YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Padayatra Completes 23 Years: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన ట్వీట్లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్ర చరిత్రను తిరగరాసిన పాదయాత్ర” అంటూ పేర్కొన్న జగన్, ఒక నాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను, ప్రజల జీవితాలను ఎలా మార్చగలదో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరూపించారని అన్నారు. 2003 ఏప్రిల్ 9న ఎండలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ప్రారంభమైన ఆ పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని గుర్తుచేశారు.
Read Also: RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు “నేనున్నాను” అనే భరోసా కలిగిందని, రాష్ట్ర ప్రజలు భారీగా మద్దతు ఇచ్చి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసి రైతులకు ఉపశమనం కల్పించారని పేర్కొన్నారు వైఎస్ జగన్.. అంతేకాక, వైఎస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని జగన్ అన్నారు. రైతులను బలోపేతం చేయడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం వంటి చర్యలు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చాయని చెప్పారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆయన చేసిన సంస్కరణలు అనేక మంది పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు కావడానికి దోహదపడ్డాయని వివరించారు జగన్. అలాగే సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి అయిన Polavaram Project పనులకు వేగం తీసుకువచ్చారని తెలిపారు. తన తండ్రి వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్న జగన్, ఆ పాదయాత్ర స్ఫూర్తితో తన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన… pic.twitter.com/B8HvVZwFah
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2026
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?