Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ysr Padayatra Completes 23 Years Jagan Mohan Reddy Makes Emotional And Sensational Remarks

YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :April 9, 2026 , 8:33 am
By Sudhakar Ravula
YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSR Padayatra Completes 23 Years: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన ట్వీట్‌లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్ర చరిత్రను తిరగరాసిన పాదయాత్ర” అంటూ పేర్కొన్న జగన్, ఒక నాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను, ప్రజల జీవితాలను ఎలా మార్చగలదో తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నిరూపించారని అన్నారు. 2003 ఏప్రిల్ 9న ఎండలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ప్రారంభమైన ఆ పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని గుర్తుచేశారు.

Read Also: RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

Also Read

  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
  • AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ కొరత ప్రభావం.. లిమిట్‌ పెంచిన బంక్‌లు..
  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు “నేనున్నాను” అనే భరోసా కలిగిందని, రాష్ట్ర ప్రజలు భారీగా మద్దతు ఇచ్చి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసి రైతులకు ఉపశమనం కల్పించారని పేర్కొన్నారు వైఎస్‌ జగన్.. అంతేకాక, వైఎస్‌ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలను మార్చేశాయని జగన్ అన్నారు. రైతులను బలోపేతం చేయడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం వంటి చర్యలు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చాయని చెప్పారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆయన చేసిన సంస్కరణలు అనేక మంది పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు కావడానికి దోహదపడ్డాయని వివరించారు జగన్. అలాగే సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి అయిన Polavaram Project పనులకు వేగం తీసుకువచ్చారని తెలిపారు. తన తండ్రి వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్న జగన్, ఆ పాదయాత్ర స్ఫూర్తితో తన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదిక వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాద‌యాత్ర‌. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్ర‌టి ఎండ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేప‌ట్టిన ఆ పాద‌యాత్ర రాష్ట్ర ప్ర‌జ‌ల హృద‌యాల్లో ధైర్యం నింపింది. నేనున్నాన… pic.twitter.com/B8HvVZwFah

— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • ap news
  • farmer welfare AP
  • padayatra history India
  • Polavaram project

తాజావార్తలు

  • AP Education Department: టీచర్‌ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్‌ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!

  • Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం

  • AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ కొరత ప్రభావం.. లిమిట్‌ పెంచిన బంక్‌లు..

  • Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..

  • AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions