YS Jagan: ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. ‘వెన్నుపోటు దినం’పై జగన్ ఆసక్తికర పోస్ట్..
- 'వెన్నుపోటు దినం' కార్యక్రమంపై జగన్ ఆసక్తికర ట్వీట్..
- ఏడాది క్రితం చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు..
- ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు..
- చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు..
- అబద్ధపు హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది.. అయితే, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ.. ‘వెన్నుపోటు దినం’ పేరుతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఈ నిరసన కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు.. చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అని దుయ్యబట్టారు జగన్..
Read Also: CM Chandrababu: తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు..
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
సీఎం చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు.. అందుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చామని పేర్కొన్నారు జగన్.. నిరసనలకు అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై మాకు మద్దతు పలికి.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్ధాలు, మోసాలను భరిస్తూ మౌనంగా ఉండరనే బలమైన సందేశం అని అభివర్ణించారు.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలకు భారీగా హాజరైన ప్రజల బాధ, నిరాశ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నిరసన కార్యక్రమానికి అండగా నిలిచి పేద ప్రజలతో కలిసి తమ వాణిని వినిపించిన ప్రతీ వైసీపీ నేత, కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..
Exactly a year ago, on June 4, Chandrababu Naidu came to power with grand promises, but not a single one has been fulfilled. Instead, he has betrayed the very people who believed in him. His false statements, broken assurances, and blatant backstabbing have pushed the state into… pic.twitter.com/H5Q80sjqrd
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2025
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!