YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాలు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందంటూ చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి దూరమని విమర్శించారు. తప్పుడు లెక్కలను చూపించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై జగన్ ఫైర్ అయ్యారు. జనం మోసపోవద్దన్న ఉద్దేశంతో అసలు లెక్కలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం తయారు చేసుకున్న లెక్కలకు కాగ్ నివేదికలకు ఎలాంటి సంబంధం ఉండదని, కాగ్ మాత్రం నిజాలను మాత్రమే బయటపెడుతుందని స్పష్టం చేశారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
జనరల్ ఆడిట్ రిపోర్టులు (CAG Reports) ప్రభుత్వ నిజమైన ఆదాయాలు, ఖర్చులు, అప్పులు, పెట్టుబడులను స్పష్టంగా తెలియజేస్తాయని జగన్ గుర్తుచేశారు. వాటి ప్రకారం రాష్ట్ర అప్పులు అధికంగా పెరిగిపోయాయని, ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వెల్లడించారు. మూలధన వ్యయం ఆందోళనకర స్థాయికి చేరిందని, భారీ అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను కొందరు దోచుకుంటున్నారని ఆరోపించారు.
అభివృద్ధి జరుగుతోందనుకునే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014–19 మధ్య తెలుగుదేశం పాలనలో రాష్ట్ర GSDP వృద్ధి గొప్పదనమే ఉంటే, ఎలా 2019–24 కాలంలోని జాతీయ జీడీపీలో రాష్ట్రం వాటా 4.78% కాగా, 2014–19 కాలంలో అది కేవలం 4.45% మాత్రమే ఉందని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం ఒక్క మెట్టు కూడా ఎక్కలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొందరిని కొన్ని రోజుల పాటు మోసం చేయగలిగినా, అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసేలా చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రచారమేనని ఆయన విమర్శించారు.
𝗧𝗗𝗣 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁’𝘀 𝗰𝗼𝗼𝗸𝗲𝗱 𝗳𝗶𝗴𝘂𝗿𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱!
Yesterday, Mr. Chandrababu Naidu released the advance estimates for the GSDP during the first half of this financial year 2025-26. As correctly pointed out by @ncbn Garu, the Government prepared the… pic.twitter.com/pG3V1H8lgY
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 9, 2025
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!