Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ys Jagan Key Direction To Ycp Leaders

YS Jagan: ముగిసిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. నేతలకు జగన్‌ దిశానిర్దేశం..

Published Date :September 24, 2025 , 2:25 pm
By Sudhakar Ravula
  • ముగిసిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం..
  • పార్టీ నేతలు, కేడర్‌కు దిశానిర్దేశం చేసిన జగన్..
  • చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది..
  • విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌ అన్నింటా తిరోగమనమే..
  • 15 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో అంత వ్యతిరేకత..
YS Jagan: ముగిసిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం.. నేతలకు జగన్‌ దిశానిర్దేశం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సూపర్‌ సిక్స్‌ మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్‌ వేధింపులు, మెడికల్‌ కాలేజీల వ్యవహారం ఇలా పలు అంశాలపై పార్టీ నేతలు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై విరిచుకుపడ్డారు జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్న ఆయన.. సంపద సృష్టిస్తానని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఇస్తానని చంద్రబాబు అన్నారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌ అన్నింటా తిరోగమనమే. కేవలం 15 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో అంత వ్యతిరేకత మూట గట్టుకుంది.. ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌పై పేపర్లే ఇచ్చిన ప్రకటనను ఇప్పుడు మార్చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్‌ ఎత్తివేశారు. అట్టర్‌ ప్లాప్‌ అయిన సూపర్‌ సిక్స్‌పై బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరు అని విరుచుకుపడ్డారు.

Read Also: Kalyani Priyadarshan : నేను ఏ అనాధాశ్రమంలోను గడపలేదు.. తప్పుడు ప్రచారాలు ఆపండి

Also Read

  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
  • Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
  • CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
Add as a preferred
source on google

చంద్రబాబు హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు జగన్‌.. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. యూరియా దొరకడం లేదు. 5 ఏళ్ల వైయస్సార్‌సీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు.. ప్రభుత్వమే దళారులతో చేతులు కలిపి, యూరియా పక్కదోవపట్టిస్తోంది. బ్లాక్‌లో యూరియాను రూ.300 ఎక్కువకు అమ్ముతున్నారు. బియ్యాన్ని ఇథనాల్‌ తయారీకే వాడాలని చెప్తున్నాడు. దీని అర్థం ధాన్యానికి ఇక ధరలు రావని చంద్రబాబు చెప్పకనే చెప్తున్నాడని దుయ్యబట్టారు.. మిగిలిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావడంలేదు. వైయస్సార్‌సీపీ హయాంలో ధరల స్థిరీకరణకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.. ఫీజురియింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయి. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ఏకంగా రూ.3500 కోట్లు బకాయి పెట్టారు.. ఆరోగ్య ఆసరా లేనే లేదన్నారు.. అయితే, మన ప్రభుత్వంలో ఏటా రూ.450 కోట్లు ఖర్చు పెట్టాం.. కానీ, ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త మెడికల్‌ కాలేజీలు అమ్ముతామంటున్నాడు. బుద్ది ఉన్న వాడెవడైనా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అమ్ముతాడా? ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులు నడుపుతుంది?.. ప్రభుత్వం ఆ పని చేయకపోతే, ప్రైవేటు రంగం నుంచి సామాన్యులకు ఆ సేవలు అందవు. వారికి ఎదురు ఉండదు.. ఏదీ కూడా ప్రైవేటు రంగం నుంచి పేదలకు అందదు. దానికి చెక్‌ పెట్టడం కోసమే, ప్రభుత్వం వాటిని స్వయంగా నడుపుతుంది.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ఒక మెడికల్‌ కాలేజీ వస్తే, అక్కడ ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుంది.. వైద్య నిపుణులు, నర్సులు వస్తారు.. అందరి సేవలు అందుతాయి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి అరి కట్టాలంటే.. అవి అవసరం. ఇంకా మెడికల్‌ సీట్లు. పేదలకు కూడా ఉచితంగా సీట్లు దొరుకుతాయి. దీని వల్ల మెడికల్‌ సీట్లు పెరుగుతాయి. డాక్టర్లు ప్రతి చోటా అందుబాటులో ఉంటారని వెల్లడించారు జగన్.

అమరావతిలో కనీస సదుపాయాలకే రెండు లక్షల కోట్లు పెట్టడతామంటున్నారు.. కానీ, మెడికల్‌ కాలేజీలకు రూ.5వేల కోట్లు పెట్టలేమంటూ అమ్మేస్తున్నారు అని విమర్శించారు జగన్.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే అమరావతిలో మొదటి దశ నిర్మాణాల కోసం లక్ష కోట్లు కావాలి.. గతంలో చంద్రబాబు దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయగా, మిగిలిన రూ.95 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అని ప్రశ్నించారు. ప్రస్తుతం అమరావతి 50 వేల ఎకరాల్లో ఉంటే, మరో 50 వేల ఎకరాలు కావాలట? మెడికల్‌ కాలేజీల కోసం రూ.5 వేల కోట్లు పెట్టరట.. కానీ, అమరావతిలో లక్ష కోట్లు పెడుతున్నారని విమర్శించారు.. మద్యం, ఇసుక, మట్టి, క్వార్ట్జ్‌, సిలికా.. దేన్నీ వదలడం లేదు. అన్నీ దోచేస్తున్నారు. కరెంట్‌ను యూనిట్‌ రూ.4.50 కి కొనేందుకు పీపీఏలు చేస్తున్నారు. దోపిడీ వల్ల ఖజానాకు ఆదాయం రావడం లేదు. మొత్తం వారి జేబుల్లోకి పోతోందని ఆరోపించారు. మన హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు ఒక్క పైసా రావడంలేదన్న జగన్.. 15 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు.. మనం 5 ఏళ్లలో చేసిన అప్పులో 15 నెలల్లోనే 58 శాతం చేశారు.. అందుకే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లలేడు. సజావుగా ఎన్నికలు జరిగితే, ఆయనకు డిపాజిట్లు రావు.. ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకే ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడు. కాబట్టి, మీరు గట్టిగా నిలబడాలి. పోరాడాలని పిలుపునిచ్చారు..

మనం పార్టీ పెట్టి 14 ఏళ్లు.. మనం ఇంత బలంగా ఉండడానికి కారణం వైయస్సార్‌సీపీ ఫ్యామిలీ.. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకున్నాడు అని తెలిపారు జగన్.. మొన్న ఎన్నికల్లో అందరూ ఒకవైపు. మనం ఒక్కరమే ఒకవైపు.. అయినా 40 శాతం ఓట్లు సాధించాం. అందుకు మన కార్యకర్తలే కారణం. డిసెంబర్‌ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తికావాలి.. సంక్రాంతి నాటికి వారికి ఐడీ కార్డులు ఇస్తాం.. రేపు ప్రభుత్వం రాగానే వారికి మంచి చేస్తాం.. వారి ద్వారా ప్రజలకు మంచి చేస్తాం.. మనం అధికారంలోకి వస్తే, వారి ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తాను.. ప్రతి పథకాన్ని వారి ద్వారా నడుపుతాం.. విద్యార్థి, మహిళ, యువత, ఎస్సీ, రైతు.. ఇలా ఏడు విభాగాలు గ్రామస్థాయిలో ఏర్పాటు కావాలన్నారు జగన్.. ఇక, రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం డిజిటల్‌ బుక్‌ తీసుకొచ్చాం.. ఒక పోర్టల్‌ అయితే, రెండోది ఐవీఆర్‌ఎస్‌ విధానం. digitalbook.weysrcp.comలో ఫిర్యాదు చేయవచ్చు.. 040-49171718 నంబర్‌కు ఐవీఆర్‌ఎస్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు జగన్‌.. అన్యాయానికి గురైనవారు ఫిర్యాదు చేయవచ్చు. రేపు మనం అధికారంలోకి రాగానే, బాధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్‌ అయినా వదిలిపెట్టం.. పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. ఈరోజు వారు రెడ్‌బుక్‌ అంటున్నారు. రేపు మనం డిజిటల్‌ బుక్‌ ఏమిటన్నది చూపిస్తాం.. అని హెచ్చరించారు వైఎస్‌ జగన్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Digital book
  • YCP leaders
  • ys jagan
  • YSRCP

తాజావార్తలు

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్

  • India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!

  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…

  • Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions