YS Jagan: ముగిసిన లండన్ పర్యటన.. బెంగళూరుకు వైఎస్ జగన్
- లండన్ లో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన..
- ఈ నెల 14న లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు..
- తన కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్..
- ఇవాళ ఉ.10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరు చేరిక.. దాదాపు 15 రోజులకు పైగా లండన్ లోనే ఉన్న జగన్ దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన విషయం విదితమే.. ఈ నెల 14వ తేదీన లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు.. ఇవాళ ఉదయం 10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరుకు చేరుకున్నారు. దాదాపు 15 రోజులకు పైగా జగన్ లండన్ లోనే ఉన్నారు.. తన కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్ వెళ్లిన జగన్.. ఇవాళ బెంగుళూరుకు తిరిగి వచ్చారు.. బెంగుళూరు కి చేరుకున్న జగన్ కు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికారు. ఇక, ప్రస్తుతం బెంగళూరులోనే బసచేయనున్న వైఎస్ జగన్.. ఫిబ్రవరి 3వ తేదీ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చే అవకాశం ఉంది.. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించనున్నారట వైఎస్ జగన్.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు.. పార్టీ నేతలపై కేసులు.. తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
Read Also: BRS Corporators Protest: జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత.. మేయర్కి వ్యతిరేకంగా నినాదాలు
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
కాగా, లండన్ వెళ్లేందుకు వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు అనుమతిచ్చిన విషయం విదితమే.. ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జగన్ యూకే వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆస్తుల కేసులో బెయిల్ మంజూరు చేసిన సమయంలో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతు కోర్టు విధించిన నేపథ్యంలో.. తన కూతురు గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు జగన్.. దీంతో.. జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. కోర్టు ఇచ్చిన సమయంలోపే లండన్ వెళ్లివచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?