YS Jagan: ముగిసిన లండన్ పర్యటన.. బెంగళూరుకు వైఎస్ జగన్
- లండన్ లో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన..
- ఈ నెల 14న లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు..
- తన కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్..
- ఇవాళ ఉ.10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరు చేరిక.. దాదాపు 15 రోజులకు పైగా లండన్ లోనే ఉన్న జగన్ దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన విషయం విదితమే.. ఈ నెల 14వ తేదీన లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు.. ఇవాళ ఉదయం 10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరుకు చేరుకున్నారు. దాదాపు 15 రోజులకు పైగా జగన్ లండన్ లోనే ఉన్నారు.. తన కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్ వెళ్లిన జగన్.. ఇవాళ బెంగుళూరుకు తిరిగి వచ్చారు.. బెంగుళూరు కి చేరుకున్న జగన్ కు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికారు. ఇక, ప్రస్తుతం బెంగళూరులోనే బసచేయనున్న వైఎస్ జగన్.. ఫిబ్రవరి 3వ తేదీ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చే అవకాశం ఉంది.. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించనున్నారట వైఎస్ జగన్.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు.. పార్టీ నేతలపై కేసులు.. తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
Read Also: BRS Corporators Protest: జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత.. మేయర్కి వ్యతిరేకంగా నినాదాలు
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
కాగా, లండన్ వెళ్లేందుకు వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు అనుమతిచ్చిన విషయం విదితమే.. ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జగన్ యూకే వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆస్తుల కేసులో బెయిల్ మంజూరు చేసిన సమయంలో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతు కోర్టు విధించిన నేపథ్యంలో.. తన కూతురు గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు జగన్.. దీంతో.. జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. కోర్టు ఇచ్చిన సమయంలోపే లండన్ వెళ్లివచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!