CM Chandrababu: మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి..
- రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కటే కమిటీ..
- రైతులకు సంబంధించిన ప్రతి పనికి సీఆర్డీఏ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ..
- రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కటే కమిటీ వేశాం.. రైతులకు సంబంధించిన ప్రతి పనికి CRDA అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ చేయిస్తాం.. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిని త్యాగం చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం.. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుంది.. రాజధాని ప్రాంతంలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో లేఔట్స్ కి త్వరలోనే అనుమతి ఇస్తాం.. క్యాపిటల్ గెయిన్సు కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని చంద్రబాబు సూచించారు.
Read Also: IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో జట్టు బలం పెరిగేనా..?
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
అయితే, అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాం.. కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తాం.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టాం.. త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని సూచించారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉంది.. నాతో సమావేశం తర్వాత అన్నింటి పైనా క్లారిటీ వచ్చింది.. రైతులు కూడా ఆనందంగా ఉన్నారు.. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించాను.. మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ది చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారు.. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ఇక, రాజధాని అభివృద్ది ఇక అన్ స్టాపబుల్ అన్నారు. రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో లే-ఔవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
తాజావార్తలు
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..