CM Chandrababu: మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి..
- రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కటే కమిటీ..
- రైతులకు సంబంధించిన ప్రతి పనికి సీఆర్డీఏ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ..
- రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కటే కమిటీ వేశాం.. రైతులకు సంబంధించిన ప్రతి పనికి CRDA అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ చేయిస్తాం.. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిని త్యాగం చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం.. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుంది.. రాజధాని ప్రాంతంలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో లేఔట్స్ కి త్వరలోనే అనుమతి ఇస్తాం.. క్యాపిటల్ గెయిన్సు కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని చంద్రబాబు సూచించారు.
Read Also: IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో జట్టు బలం పెరిగేనా..?
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
అయితే, అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాం.. కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తాం.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టాం.. త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని సూచించారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉంది.. నాతో సమావేశం తర్వాత అన్నింటి పైనా క్లారిటీ వచ్చింది.. రైతులు కూడా ఆనందంగా ఉన్నారు.. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించాను.. మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ది చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారు.. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ఇక, రాజధాని అభివృద్ది ఇక అన్ స్టాపబుల్ అన్నారు. రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో లే-ఔవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..