Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Why Are Chandrababu Naidu And Pawan Kalyan Silent After The Sit Report Asks Ambati Rambabu

Ambati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నోర్లు ఎందుకు మూత పడ్డాయి..?

Published Date :January 30, 2026 , 8:00 pm
By Sudhakar Ravula
Ambati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ నోర్లు ఎందుకు మూత పడ్డాయి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ambati Rambabu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ నివేదిక వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం పాటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిట్ రిపోర్టు వచ్చాక ఇంతవరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మిన నీచులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పూర్తిగా చెంచాగా మారిపోయారని, సొంత పార్టీ నడుపుతున్నానన్న సంగతే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా వీరిద్దరూ వ్యవహరించారని ఆరోపించారు.

లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతువుల కొవ్వు ఉందంటూ పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇలాంటి విష ప్రచారం చేయడం ధర్మమా అని ప్రశ్నించారు అంబటి.. అసలు శాంపిల్స్ తీసిన ట్యాంకర్లు కూటమి ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని, చంద్రబాబు సీఎం అయిన నెల రోజుల తర్వాత వచ్చిన ట్యాంకర్లలోనే శాంపిల్స్ తీసినట్లు ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా చెబుతున్నాయని అంబటి తెలిపారు. వాటిల్లో జంతువుల కొవ్వు కలవలేదని నివేదికలు తేల్చినా, వైసీపీపై నిందలు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో సీబీఐ తేల్చిందని, అయినప్పటికీ తప్పుడు ప్రచారాలు ఆపడం లేదని మండిపడ్డారు. హర్ష్ డెయిరీ పేరుతో బోలేబాబా ఎంటరైనది కూడా చంద్రబాబు హయాంలోనేనని గుర్తు చేశారు.

Also Read

  • YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..
  • CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
  • AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
  • Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు..

వైవీ సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన పేరు ఛార్జిషీట్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు అంబటి.. చంద్రబాబుకు ఇప్పటికీ బుద్ధి రాలేదని, లడ్డూకి పంగనామాలు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు సృష్టించారని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ కొండ మీద కూర్చుని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, కొందరు అధికారులు కూడా దైవం దగ్గర అపచారానికి పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. శ్యామలరావు, వెంకన్న చౌదరి లాంటి వారికి తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. చంద్రబాబు మోజేతి నీళ్లు తాగుతూ ఇష్టానుసారం వ్యవహరించే వారిని వదిలిపెట్టేదే లేదని అన్నారు. లడ్డూ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయని, సిట్ రిపోర్టు వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాళ్ల నోర్లు ఎందుకు మూత పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయ నాయకుడిగా మారితేనే మంచిదని హితవు పలికారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ambati rambabu comments
  • Andhra Pradesh political news
  • Animal fat allegation Tirumala
  • Chandrababu Naidu silence SIT report
  • Pawan Kalyan Tirumala Laddu remarks

తాజావార్తలు

  • Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?

  • Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!

  • Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం

  • Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?

  • Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions