AP Pensions: కొనసాగుతోన్న పెన్షన్ల వెరిఫికేషన్… ఆ తర్వాతే తొలగింపు..!
- ఏపీలో 8.18 లక్షల పెన్షన్ల వేరిఫికేషన్ ప్రక్రియ..
- మూడు నెలల పాటు తనిఖీ ప్రక్రియ..
- నకిలీ సర్టిఫికెట్లు అని తేలితే ముందుగా నోటీసులు..
- ఆ తర్వాత పెన్షన్ తొలగింపుపై నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్లో తప్పుడు పత్రాలతో వేలాది మంత్రి ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తప్పుడు మార్గంలో మెడికల్ సర్టిఫికెట్లు పొంది.. వాటితో దరఖాస్తు చేసుకుని పెన్షన్ల రూపంలో ప్రభుత్వ సొమ్ము నొక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఏపీలో 8 లక్షల 18 వేల పెన్షన్ల కు సంబంధించి వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దివ్యంగుల పెన్షన్.. వివిధ వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారి పెన్షన్లపై ప్రధానంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తోంది.. కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్, తలసేమియా.. ఇలా వివిధ కేటగిరీలుగా పెన్షన్ పంపిణీ జరుగుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకునేవారిని గుర్తించే పని పడిపోయింది ప్రభుత్వం.
Read Also: Onion Juice: ఈ రసం ఒక గ్లాస్ తాగితే చాలు నిమిషాల్లో కడుపు నొప్పి మాయం
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
అయితే, మూడు నెలల పాటు ఈ తనిఖీ ప్రక్రియ కొనసాగించనున్నారు.. జిల్లా స్థాయి అధికారులు… మెడికల్ టీమ్, ఒక డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పెన్షన్ తనిఖీలు కొనసాగిస్తున్నారు.. ఇక, తనిఖీలు పూర్తయిన తర్వాత ఒక వేళ అవి నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తిస్తే ముందుగా సంబంధిత పెన్షనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు.. ఆ తర్వాత పెన్షన్ తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.. తనిఖీ చేసిన డేటా మూడు నెలల తర్వాత ప్రకటించాలా…? లేక ప్రతి 15 రోజులకు ప్రకటించి.. నిర్ణయం తీసుకోవాలా? అనే విషయంపై చర్చిస్తోంది ప్రభుత్వం.. కాగా, వైసీపీ హయాంలో భారీ సంఖ్యలో అనర్హులకు పెన్షన్లు నమోదు చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.. అంతేకాదు.. అవి నకిలీ పెన్షన్లు అని తేలితే.. లబ్ధిదారుల నుంచి.. పెన్షన్ల మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామంటూ కూటమి నేతలు వ్యాఖ్యానించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?