TDP Politburo Key Decisions: టీటీడీపీ పొలిట్బ్యూరో కీలక నిర్ణయాలు.. పార్టీ కార్యకర్తలకు గుడ్న్యూస్..
- కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగుదేశం పొలిట్బ్యూరో సమావేశం..
- 12 అంశాల అజెండాతో పొలిట్ బ్యూరో భేటీ..
- పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ..
- పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు..
TDP Politburo Key Decisions: తెలుగుదేశం పొలిట్బ్యూరో.. పార్టీ కార్యకర్తలకు గుడ్న్యూస్ చెప్పింది.. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయాన్ని కలిపిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.. టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. 12 అంశాల అజెండాతో పొలిట్ బ్యూరో జరిగింది.. పహల్గామ్లో ఉగ్రదాడిని పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించిందని తెలిపారు.. ఇక, టీడీపీ కార్యకర్తలకు కల్పించే బీమా సౌకర్యాన్ని రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు. త్వరలో అన్నదాత సుఖీభవ మొదటి విడత చెల్లిస్తాం.. ఇక నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తున్నాం.. ఏ నెలలో ఏ పథకం వస్తుంది అనేది క్యాలండర్ లో ఉంటుందని తెలిపారు.
Read Also: Pawan Kalyan : ఓజీ షూట్ కు పవన్.. ‘ఉస్తాద్’ కూడా ముగిస్తాడా..?
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
మండల పార్టీ అధ్యక్షులు మూడు పర్యాయాలు అంటే ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగినవాళ్లు తప్పుకోవాలని పొలిట్ బ్యూరో లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు అచ్చెన్నాయుడు.. మండల పార్టీ అధ్యక్షులు అంతకన్నా పెద్ద పదవిలోకి అయినా వెళ్లాలి.. లేదా వేరే కమిటీలో ఉండాలని సూచించారు.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు మహానాడు లోపు పూర్తి అవుతాయని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అభినందిస్తూ తీర్మానం చేసింది తెలుగుదేశంపార్టీ పొలిట్బ్యూరో. ఇక, దీపం 2 పథకం ద్వారా ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది.. అలాగే జూన్ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Read Also: Macherla: మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు..
ఇక, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం వల్ల మహానాడు చెయ్యాలా వద్దా అనే అనుమానం వచ్చింది.. కానీ, ఇప్పుడు పరిస్థితి సద్దుమనగడంతో మహానాడు నిర్వహిస్తున్నాం అన్నారు.. మహానాడులో మొదటి రెండు రోజులు.. జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలు ఉంటారు.. మూడో రోజు గ్రామ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. మొత్తం 70 వేల మంది ఈ మహానాడుకు హాజరవుతారని వెల్లడించారు.. మహానాడు జరిగే సికే దీన్నే ప్రాంతంలో ఎకమిడేషన్ సౌకర్యం లేదని చాలా మంది చెప్పారు. అయినా కూడా మహానాడు కడపలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. ఈ నెల 27, 28, 29న మహానాడుని కడపలో ఘనంగా నిర్వహించనున్నాం అన్నారు పల్లా శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో