TDP: టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
- టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..
- ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు..
- తప్పనిసరిగా కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి..
- చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి..
- వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో ఆహ్వానించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటిమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరికలు భారీగా పెరిగిపోయాయి.. అయితే, ఇప్పుడు అదే పార్టీకి సమస్యగా మారిందా? అనే చర్చ సాగుతోంది.. దానికి అనుగుణంగా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది.. ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి.. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..
Read Also: కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?
Also Read
టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీటీడీలోకి జాయిన్ చేసుకునేముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. వారి గురించి పూర్తి కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత.. పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది.. ఈ విషయాన్ని టీడీపీలోని వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు పల్లా శ్రీనివాసరావు.. ఈ విషయాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, నియోజకవర్గ పరిశీలకు సూచించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు..
Read Also: Harish Rao: రేవంత్ రెడ్డి బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీతో కుమ్మక్కయ్యాడు
కాగా, మహానాడు సహా ఇతర సమావేశాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారు.. వారితో జాగ్రత్త.. ఇక్కడి విషయాలు అక్కడకి చేరిపోతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలు, శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు టీడీపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!