Paris Hindu Temple: ఫ్రాన్స్లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Hindu Temple: భారతదేశం – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది. పారిస్లోని బుస్సీ-సెయింట్-జార్జెస్లో కొత్త హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారు. అలాగే ఇండియా నుంచి మొదటి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు ఉత్సవ స్వాగతం పలికారు. ఇది ఆలయ నిర్మాణ తదుపరి దశకు సంకేతం, ఇది ఫ్రాన్స్లో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. శతాబ్దాల నాటి హస్తకళ, ఉమ్మడి నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ఆలయ నిర్మాణం కోసం భారతదేశం నుంచి తీసుకువచ్చి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి రూపొందించిన ఈ రాళ్లు శతాబ్దాల నిర్మాణ వారసత్వాన్ని సూచిస్తాయి. ఎంపిక చేసిన రాళ్లను భారతదేశంలోని నైపుణ్యం కలిగిన చేతివృత్తుల వారు వారి చేతులతో చెక్కారు. ఫ్రాన్స్లో ఆలయ నిర్మాణం కోసం భారతీయ కళాకారులు ఫ్రెంచ్ స్టోన్మేసన్లతో కలిసి పని చేస్తారు. వీరిలో నోట్రే-డామ్ కేథడ్రల్ పునరుద్ధరణలో పాల్గొన్న బృందంలోని వారు కూడా ఉన్నారు. భారతీయ చేతివృత్తుల వారి సంప్రదాయాలను ఫ్రాన్స్ ప్రఖ్యాత స్టోన్మేసన్రీ నైపుణ్యంతో ఏకం చేసి ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆరాధనకే కాకుండా, సంస్కృతి, విద్య, సమాజ భాగస్వామ్యానికి కూడా అంకితమైన స్థలాన్ని సృష్టించే సమగ్ర దృక్పథంలో భాగంగా ఈ ఆలయాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఆలయం భారతదేశం – ఫ్రాన్స్ మధ్య స్నేహానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది.
ఒక చారిత్రాత్మక మైలురాయి..
పారిస్ టెంపుల్ ప్రాజెక్ట్ CEO, BAPS UK, యూరప్ ట్రస్టీ సంజయ్ కారా మాట్లాడుతూ.. “భారతదేశం నుంచి మొదటి రాళ్ల రాక ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ప్రతి ఒక్కటి వారసత్వం, శ్రద్ధ, ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది భాగస్వామ్య గౌరవం, సహకారం ద్వారా భారతీయ సంప్రదాయం, ఫ్రెంచ్ ఇంజినీరింగ్ యొక్క ఐక్యతను సూచిస్తుంది. సేవ, వినయం, సామరస్యాన్ని నొక్కి చెప్పే బోధనలు కలిగిన మహంత్ స్వామి మహారాజ్ విలువలు, దార్శనికత ద్వారా మార్గనిర్దేశం చేయబడి, భారతీయ – ఫ్రెంచ్ నైపుణ్యాన్ని కలిపే ప్రాజెక్ట్లో భాగం కావడం గొప్ప గౌరవం. ఇది ఆరాధకులకు మాత్రమే కాకుండా సంస్కృతి, అభ్యాసం, సామరస్యానికి నిలయంగా విస్తృత సమాజానికి సేవ చేసే ఆలయంగా కూడా అభివృద్ధి చెందుతుంది” అని చెప్పారు.
ఫ్రాన్స్లో భారత రాయబారి సంజీవ్ కుమార్ సింగ్లా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన సహకారాన్ని సూచిస్తుంది. ఇది పవిత్ర వాస్తుశిల్పం యొక్క రెండు గొప్ప సంప్రదాయాల కలయిక” అని అన్నారు.
READ ALSO: Online Dating App Scam: దూల తీర్చేసిన డేటింగ్ యాప్.. గంట ముచ్చటకి నెల జీతం హాంఫట్!
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..