Paris Hindu Temple: ఫ్రాన్స్లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Hindu Temple: భారతదేశం – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది. పారిస్లోని బుస్సీ-సెయింట్-జార్జెస్లో కొత్త హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారు. అలాగే ఇండియా నుంచి మొదటి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు ఉత్సవ స్వాగతం పలికారు. ఇది ఆలయ నిర్మాణ తదుపరి దశకు సంకేతం, ఇది ఫ్రాన్స్లో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. శతాబ్దాల నాటి హస్తకళ, ఉమ్మడి నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది.
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
ఆలయ నిర్మాణం కోసం భారతదేశం నుంచి తీసుకువచ్చి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి రూపొందించిన ఈ రాళ్లు శతాబ్దాల నిర్మాణ వారసత్వాన్ని సూచిస్తాయి. ఎంపిక చేసిన రాళ్లను భారతదేశంలోని నైపుణ్యం కలిగిన చేతివృత్తుల వారు వారి చేతులతో చెక్కారు. ఫ్రాన్స్లో ఆలయ నిర్మాణం కోసం భారతీయ కళాకారులు ఫ్రెంచ్ స్టోన్మేసన్లతో కలిసి పని చేస్తారు. వీరిలో నోట్రే-డామ్ కేథడ్రల్ పునరుద్ధరణలో పాల్గొన్న బృందంలోని వారు కూడా ఉన్నారు. భారతీయ చేతివృత్తుల వారి సంప్రదాయాలను ఫ్రాన్స్ ప్రఖ్యాత స్టోన్మేసన్రీ నైపుణ్యంతో ఏకం చేసి ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆరాధనకే కాకుండా, సంస్కృతి, విద్య, సమాజ భాగస్వామ్యానికి కూడా అంకితమైన స్థలాన్ని సృష్టించే సమగ్ర దృక్పథంలో భాగంగా ఈ ఆలయాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఆలయం భారతదేశం – ఫ్రాన్స్ మధ్య స్నేహానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది.
ఒక చారిత్రాత్మక మైలురాయి..
పారిస్ టెంపుల్ ప్రాజెక్ట్ CEO, BAPS UK, యూరప్ ట్రస్టీ సంజయ్ కారా మాట్లాడుతూ.. “భారతదేశం నుంచి మొదటి రాళ్ల రాక ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ప్రతి ఒక్కటి వారసత్వం, శ్రద్ధ, ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది భాగస్వామ్య గౌరవం, సహకారం ద్వారా భారతీయ సంప్రదాయం, ఫ్రెంచ్ ఇంజినీరింగ్ యొక్క ఐక్యతను సూచిస్తుంది. సేవ, వినయం, సామరస్యాన్ని నొక్కి చెప్పే బోధనలు కలిగిన మహంత్ స్వామి మహారాజ్ విలువలు, దార్శనికత ద్వారా మార్గనిర్దేశం చేయబడి, భారతీయ – ఫ్రెంచ్ నైపుణ్యాన్ని కలిపే ప్రాజెక్ట్లో భాగం కావడం గొప్ప గౌరవం. ఇది ఆరాధకులకు మాత్రమే కాకుండా సంస్కృతి, అభ్యాసం, సామరస్యానికి నిలయంగా విస్తృత సమాజానికి సేవ చేసే ఆలయంగా కూడా అభివృద్ధి చెందుతుంది” అని చెప్పారు.
ఫ్రాన్స్లో భారత రాయబారి సంజీవ్ కుమార్ సింగ్లా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన సహకారాన్ని సూచిస్తుంది. ఇది పవిత్ర వాస్తుశిల్పం యొక్క రెండు గొప్ప సంప్రదాయాల కలయిక” అని అన్నారు.
READ ALSO: Online Dating App Scam: దూల తీర్చేసిన డేటింగ్ యాప్.. గంట ముచ్చటకి నెల జీతం హాంఫట్!
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!