AP Liquor Scam Case: సుప్రీంకోర్టులో చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ఊరట.. ఏపీ సర్కార్కు నోటీసులు
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఊరట..
- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
- ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ.. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఆ తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.. కాగా, అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. దీంతో, విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్ర, సిద్ధార్థ అగర్వాల్.. వాదనల తర్వాత చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే ఏపీ సర్కార్కు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: IND vs WI: స్లో అండ్ స్టడీగా టీమిండియా బ్యాటింగ్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డి.. ఏ-39గా ఉన్నారు.. అయితే, హైకోర్టులో మోహిత్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు.. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. తుడా చైర్మన్ హోదాలో మోహిత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. మద్యం ముడుపుల సొమ్మును తరలించేందుకు అధికారిక వాహనాలు వినియోగించారని హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. పిటిషనర్కు నేరచరిత్ర ఉందని.. ఏ-38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబసభ్యులు అనేక కంపెనీల్లో భాగస్వాములు అయ్యారని.. పేర్కొన్న విషయం విదితమే కాగా.. మోహిత్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు.. దీంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహిత్రెడ్డికి ఊరట దక్కింది..
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!