Andhra Pradesh: సెలవు రోజుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. భారీ ఆదాయం..
- ఆది, సోమవారాల్లోనూ పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..
- ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లును నిర్వహించారు. శనివారం అమావాస్య కావటంతో ఆదివారం ఉగాది పండుగ రోజు కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక సోమవారం రంజాన్ పండుగ రోజు కూడా స్వల్ప సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
- Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు
ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరింది. ఇందులో 2 కోట్ల ఆదాయం గుంటూరు జిల్లా నుంచి వచ్చింది. సాధారణ రోజుల్లో రోజుకు 30 కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వానికి ప్రతి రోజు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వస్తుంది. అయితే, ఆ మేర ఆదాయం రాకపోయినప్పటికీ సెలవు రోజుల్లో కొంత మేరకు ఆదాయం వచ్చినట్టైంది. రెండో రోజున కూడా ఇదే విధంగా 8 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజులుకావటంతో టాక్స్ రిటర్న్ లో ఆదాయాలు, ఆస్తుల వివరాలు చూపించే వారు రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి వెసులుబాటు కూడా ఈ రెండు రోజులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, రెండు రోజుల్లో కలిపి.. మొత్తంగా రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది.. సాయంత్రం వరకు రూ.10.90 కోట్ల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పూర్తిస్థాయి లెక్కలు తేలే సరికి మరికొంత ఆదయాం సమకూరే అవకాశం ఉందంటున్నారు.. మొత్తంగా.. సెలవు రోజుల్లో పనిచేయడంతో రూ.10.90 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది..
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!