Andhra Pradesh: సెలవు రోజుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. భారీ ఆదాయం..
- ఆది, సోమవారాల్లోనూ పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..
- ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లును నిర్వహించారు. శనివారం అమావాస్య కావటంతో ఆదివారం ఉగాది పండుగ రోజు కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక సోమవారం రంజాన్ పండుగ రోజు కూడా స్వల్ప సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరింది. ఇందులో 2 కోట్ల ఆదాయం గుంటూరు జిల్లా నుంచి వచ్చింది. సాధారణ రోజుల్లో రోజుకు 30 కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వానికి ప్రతి రోజు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వస్తుంది. అయితే, ఆ మేర ఆదాయం రాకపోయినప్పటికీ సెలవు రోజుల్లో కొంత మేరకు ఆదాయం వచ్చినట్టైంది. రెండో రోజున కూడా ఇదే విధంగా 8 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజులుకావటంతో టాక్స్ రిటర్న్ లో ఆదాయాలు, ఆస్తుల వివరాలు చూపించే వారు రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి వెసులుబాటు కూడా ఈ రెండు రోజులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, రెండు రోజుల్లో కలిపి.. మొత్తంగా రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది.. సాయంత్రం వరకు రూ.10.90 కోట్ల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పూర్తిస్థాయి లెక్కలు తేలే సరికి మరికొంత ఆదయాం సమకూరే అవకాశం ఉందంటున్నారు.. మొత్తంగా.. సెలవు రోజుల్లో పనిచేయడంతో రూ.10.90 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది..
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?