Andhra Pradesh: సెలవు రోజుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. భారీ ఆదాయం..
- ఆది, సోమవారాల్లోనూ పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..
- ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లును నిర్వహించారు. శనివారం అమావాస్య కావటంతో ఆదివారం ఉగాది పండుగ రోజు కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక సోమవారం రంజాన్ పండుగ రోజు కూడా స్వల్ప సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరింది. ఇందులో 2 కోట్ల ఆదాయం గుంటూరు జిల్లా నుంచి వచ్చింది. సాధారణ రోజుల్లో రోజుకు 30 కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వానికి ప్రతి రోజు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వస్తుంది. అయితే, ఆ మేర ఆదాయం రాకపోయినప్పటికీ సెలవు రోజుల్లో కొంత మేరకు ఆదాయం వచ్చినట్టైంది. రెండో రోజున కూడా ఇదే విధంగా 8 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజులుకావటంతో టాక్స్ రిటర్న్ లో ఆదాయాలు, ఆస్తుల వివరాలు చూపించే వారు రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి వెసులుబాటు కూడా ఈ రెండు రోజులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, రెండు రోజుల్లో కలిపి.. మొత్తంగా రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది.. సాయంత్రం వరకు రూ.10.90 కోట్ల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పూర్తిస్థాయి లెక్కలు తేలే సరికి మరికొంత ఆదయాం సమకూరే అవకాశం ఉందంటున్నారు.. మొత్తంగా.. సెలవు రోజుల్లో పనిచేయడంతో రూ.10.90 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది..
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..