Minister Nara Lokesh: 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ.. పెట్టుబడులతో రండి..
- మరో 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ..
- పెట్టుబడులతో రండి.. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం..
- జీసీసీ గ్లోబల్ లీడర్ల రోడ్షోలో మంత్రి లోకేష్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: మరో 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబుతోంది.. పెట్టుబడులతో రండి.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటూ జీసీసీ గ్లోబల్ లీడర్ల రోడ్షోలో పిలుపునిచ్చారు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.. దేశంలో పేరెన్నిగన్న దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిథులతో బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించిన లోకేష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అన్నారు..
Read Also: Kollywood : ఓ వైపు డిజాస్టర్స్.. అయినా కూడా సీక్వెల్స్ పై స్టార్ హీరోల మోజు..
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
ఇక, టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో.. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో 5 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోందన్నారు మంత్రి లోకేష్.. ఇది భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్గా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు విశాఖ సిటీ ఐటీ హబ్గా తయారవుతోంది. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నాం. అంతేకాదు, దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు అందిస్తున్నామని వెల్లడించారు.. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా.. ఆహ్వానించారు మంత్రి లోకేష్.. ఈ రోడ్ షోలో లోవ్స్ ఇండియా ఎండీ అంకుర్ మిట్టల్, రోల్స్ రాయ్స్ వైస్ ప్రెసిడెంట్ హరిహరన్ గణేశన్, శాక్స్ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మధు నటేశన్, జేసీ పెన్నీ ఇండియా ఎండీ కౌశిక్ దాస్, లులూ లెమన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మైసూర్, డెల్టా ఎయిర్ లైన్స్ డైరక్టర్ సైఫ్ అహమ్మద్ షరీఫ్, విక్టోరియా సీక్రెట్ వైస్ ప్రెసిడెంట్ వసుధారిణి శ్రీనివాసన్, నసుని ఇండియా సీనియర్ డైరక్టర్ పెద్దరెడ్డెప్ప, ఎఎన్ జెసీఎఫ్ఓ కవితా రమేష్, ఆస్ట్రల్ ల్యాబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివానంద ఆర్. కోటేశ్వర్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ సీఈవో లలితా ఇంద్రకంటి, ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్.. తదితరలు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!