AP Legislative Council: మండలిలో సద్దుమణిగిన ప్రోటోకాల్ వివాదం
- శాసన మండలిలో సద్దుమణిగిన ప్రోటోకాల్ వివాదం..
- మండలి చైర్మన్ ప్రోటోకాల్ విషయంలో..
- జరిగిన పరిణామాలను దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని పయ్యావుల హామీ..
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రోటోకాల్ వివాదం సద్దుమణిగింది.. మండలి చైర్మన్ కు ప్రోటోకాల్ విషయంలో జరిగిన పరిణామాలను దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇవ్వడంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాంతించారు.. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన మండలి చైర్మన్ మోషేర్రాజు.. వ్యక్తులకు, వ్యవస్థలకు, అధికారులకు గౌరవం ఇవ్వాలని సూచించారు.. తన వ్యక్తిగత అంశాన్ని గుర్తించి లేవనెత్తిన ప్రతిపక్షం, స్పందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మండలి చైర్మన్ మోషేర్రాజు..
Read Also: AI Tools : విద్యార్థుల నైఫుణ్యాలను తగ్గిస్తున్న ChatGPT .. అధ్యయనంలో వెల్లడి..
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా, ఈ రోజు శాసనమండలి ప్రారంభం కాగానే, నిరసనకు దిగారు వైసీపీ సభ్యులు.. సభాపతి గౌరవాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.. రాజ్యాంగ హక్కులను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు.. సభానాయకుడు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే, వైసీపీ సభ్యుల నిరసనల మధ్య మండలికి 10 నిమిషాల విరామం ప్రకటించారు చైర్మన్.. ఇక, విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా.. అదే పరిస్థితి కొనసాగింది.. మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా ఉంటోందన్న వైసీపీ సభ్యులు ఆరోపించారు.. అసెంబ్లీ, మండలిలో ఒకేరకమైన కాఫీ, భోజనాలు లేవని సభ దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఇలాంటి తేడా ఎక్కడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇచ్చారు.. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్.. ఇక, ప్రోటోకాల్ వివాదంపై కూడా పయ్యావుల కేశవ్ హామీ ఇవ్వడంతో ప్రోటోకాల్ వివాదం సద్దుమణిగింది..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!