PM Modi AP Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ప్రధాని మోడీ ఈ నెల 16వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది.. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు.. ఏపీ పర్యటన కోసం.. 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని.. ఉదయం 10.20కి కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు.. ఇక, 10.25కి ప్రత్యేక హెలికాఫ్టర్లో కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి సున్నిపెంట హెలిప్యాడ్కు బయల్దేరనున్నారు.. ఉదయం 11.05 గంటలకు సున్నిపెంట చేరుకుని.. అక్కడి నుంచి ఉదయం 11.10కి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు.. 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.. మధ్యాహ్నం 12.45కి భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకొని 1.25కి సున్నిపెంటకు బయల్దేరనున్నారు.. ఇక, మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యా్డ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు చేరుకొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.. సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.. 4.15కి రోడ్డు మార్గంలో నన్నూరు హెలిపాడ్కు చేరుకొని.. హెలికాఫ్టర్లో 4.40కి కర్నూల్ ఎయిర్పోర్ట్కు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లడంతో.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ముగియనుందవి.. ఇక, అక్కడి నుంచి బయల్దేరి రాత్రి 7.15కి ఢిల్లీ చేరుకోనున్నారు ప్రధాని మోడీ..
ప్రధాని మోడీ ఏపీ టూర్ షెడ్యూల్..
* 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న ప్రధాని మోడీ
* 10.20కి కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు..
* 10.25కి ప్రత్యేక హెలికాఫ్టర్లో సున్నిపెంటకు బయల్దేరతారు..
* 11.10కి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు..
* 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోన్న మోడీ..
* దర్శనం అనంతరం మధ్యాహ్నం 12.45కి భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు..
* మధ్యాహ్నం 1.25కి శ్రీశైలం నుంచి సున్నిపెంటకు బయల్దేరతారు..
* మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు చేరుకుంటారు..
* 2.30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు చేరుకోనున్న ప్రధాని మోడీ..
* 2.30 తర్వాత శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోడీ..
* సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..
* 4.15 కి రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్కు చేరుకుంటారు..
* నన్నూరు హెలిప్యాడ్ నుంచి 4.40కి కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు
* సాయంత్రం 4.40 తర్వాత కర్నూలు నుంచి బయల్దేరి రాత్రి 7.15కి ఢిల్లీ చేరుకోనున్న ప్రధాని మోడీ..