Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనలు సృష్టించే రాజకీయాలకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్రం పట్ల ఒకే భావన పెరగాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. తెలంగాణ ప్రజలకు తమ రాష్ట్రంపై ఉన్న భావోద్వేగ అనుబంధం కనిపిస్తోందని, అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్రం కంటే కులాలపై ఎక్కువ అభిమానం కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రం అనే భావన బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసిన పవన్, వారి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. రైతుల సహకారం, నమ్మకంతో ప్రారంభమైన అమరావతి ప్రాజెక్టును రాజకీయ వివాదాల కేంద్రంగా మార్చడం సరికాదన్నారు. ‘జై ఆంధ్రా’ అనే నినాదం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, మొత్తం రాష్ట్రాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే భావనగా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి తమ రాజధాని అనే భావన కలగాలని చెప్పారు. ప్రజలను కలపడానికి వచ్చామని, విడదీయడానికి రాలేదని స్పష్టం చేశారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
అమరావతి విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని విధానపరంగా చర్చించాలని పవన్ సూచించారు. రాజధాని నమూనా, అభివృద్ధి ప్రణాళికలు, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని, కానీ బెదిరింపులు, హింసాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేసిన పవన్, రౌడీయిజం, గూండాయిజం వంటి ధోరణులతో ఎవరినీ భయపెట్టలేరని అన్నారు. చంపేస్తాం, నరికేస్తాం వంటి వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై వివిధ ప్రతిపాదనలు వచ్చాయని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు కూడా వినిపించాయని గుర్తుచేశారు. అయితే వాటి వెనుక ఉన్న ఉద్దేశాలపై అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి గతంలోనే విస్తృత అంగీకారం లభించిందని, అందువల్ల ఇప్పుడు అందరూ కలిసి అమరావతి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!