Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనలు సృష్టించే రాజకీయాలకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్రం పట్ల ఒకే భావన పెరగాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. తెలంగాణ ప్రజలకు తమ రాష్ట్రంపై ఉన్న భావోద్వేగ అనుబంధం కనిపిస్తోందని, అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్రం కంటే కులాలపై ఎక్కువ అభిమానం కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రం అనే భావన బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసిన పవన్, వారి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. రైతుల సహకారం, నమ్మకంతో ప్రారంభమైన అమరావతి ప్రాజెక్టును రాజకీయ వివాదాల కేంద్రంగా మార్చడం సరికాదన్నారు. ‘జై ఆంధ్రా’ అనే నినాదం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, మొత్తం రాష్ట్రాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే భావనగా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి తమ రాజధాని అనే భావన కలగాలని చెప్పారు. ప్రజలను కలపడానికి వచ్చామని, విడదీయడానికి రాలేదని స్పష్టం చేశారు.
Also Read
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
అమరావతి విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని విధానపరంగా చర్చించాలని పవన్ సూచించారు. రాజధాని నమూనా, అభివృద్ధి ప్రణాళికలు, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని, కానీ బెదిరింపులు, హింసాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేసిన పవన్, రౌడీయిజం, గూండాయిజం వంటి ధోరణులతో ఎవరినీ భయపెట్టలేరని అన్నారు. చంపేస్తాం, నరికేస్తాం వంటి వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై వివిధ ప్రతిపాదనలు వచ్చాయని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు కూడా వినిపించాయని గుర్తుచేశారు. అయితే వాటి వెనుక ఉన్న ఉద్దేశాలపై అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి గతంలోనే విస్తృత అంగీకారం లభించిందని, అందువల్ల ఇప్పుడు అందరూ కలిసి అమరావతి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
తాజావార్తలు
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!