Minister Nimmala Ramanaidu: విధ్వంసకారుడే.. విధ్వంసం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం..!
- విధ్వంసకారుడే విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు..
- విధ్వంసానికి నిర్వచనం గురించి చెబుతున్నారు..
- ఇది ఈ శతాబ్దపు విడ్డూరమన్న మంత్రి నిమ్మల రామానాయుడు..
- వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి..
Minister Nimmala Ramanaidu: విధ్వంసకారుడే విధ్వంసం గురించి, విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు. దుష్టపాలన, తుగ్లక్ పాలనకు బదులుగా.. జగన్ పాలన అని ప్రజలు ఉదహరించుకున్నారు. జగన్ ఐదేళ్ల రివర్స్ పాలన చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు, ప్రపంచదేశాలే నివ్వెర పోయాయన్నారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్దకమైందని.., డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని.. ఫలితంగా ఇవాళ వెయ్యి కోట్లు అదనపు వ్యయం అవుతుందన్నారు.. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎత్తును 41.15 మీటర్లు అని చెప్పి అణువణువునా అన్యాయం చేసింది వైఎస్ జగన్ కాదా? అని నిలదీశారు రామానాయుడు.
Read Also: CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు భారీ ఊరట..
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన జగన్ పై ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా జగన్ అరాచక పాలనలో ఎక్కడి పనులు అక్కడే బంద్ అయ్యాయని విమర్శించారు.. ఎవరి డబ్బులు, ఎవరికి బటన్ నొక్కావు, అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరధం పట్టలేదు..? అని ప్రశ్నించారు.. నీ ఘోర పరాజయానికి, రాజకీయ పతనానికి కారణాలు విశ్లేషించుకో అని సలహా ఇచ్చారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, పాలనా పరిపక్వత ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ మేలు కలయికకు విజయం ఆంధ్రుల నిర్ణయం. వీరిపై విమర్శలు చేస్తే ఆంధ్రులపై చేసినట్లే అని వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో