Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Nimmala Ramanaidu About Cm Chandrababu Polavaram Project Tour

Minister Nimmala Ramanaidu: మరోసారి పోలవరం పర్యటనకు సీఎం.. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ ప్రకటన..!

Published Date :December 3, 2024 , 8:00 pm
By Sudhakar Ravula
  • మరోసారి పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు..
  • ఈ నెల 2వ వారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన..
  • పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకటించనున్న సీఎం..
Minister Nimmala Ramanaidu: మరోసారి పోలవరం పర్యటనకు సీఎం.. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ ప్రకటన..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించి.. ఇప్పటి వరకు జరిగిన పనులపై సమీక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, మరోసారి పోలవరం పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం.. అంతేకాదు.. ఈ పర్యటనలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పునర్‌నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.. ఇరిగేషన్ శాఖలో పలు ప్రాజెక్టులపై, ప్రధానంగా పోలవరంపై సీఎం రివ్యూ నిర్వహించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరాన్ని యజ్ఞం లాగా పునర్నిర్మాణం చేయాలని చర్చించాం.. ఈ నెల 2వ వారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఉంటుంది.. ఈ పర్యటనలోనే పోలవరం నిర్మాణం షెడ్యూల్ ను సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు..

Read Also: Fastest Centuries In T20: టి20లలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్స్ వీరే

ఈసీఆర్ఎఫ్ ఎలా పూర్తి చేస్తాం..? ఎప్పుడు పూర్తి చేస్తాం..? అనే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు తెలిపారు మంత్రి నిమ్మల.. షెడ్యూల్ ప్రకటన తేదీ నుంచి అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.. గత పాలనలో డయాఫ్రం వాల్ పూర్తిగా విధ్వంసం అయింది.. మెయిన్ డ్యాం ప్రాంతంలో భారీ గుంతలు పడ్డాయి.. భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడేవి అన్నీ పాడైపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, 2025లో పోలవరం పనులు పూర్తిస్ధాయిలో జరుగుతాయి.. టెక్నికల్ అనుమతులు కూడా సూత్రప్రాయంగా వచ్చాయి.. డయాఫ్రం వాల్ కు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణానికి సూత్రప్రాయంగా ఇంజనీర్లు అంగీకరించారు.. చంద్రబాబు ప్రకటించిన దగ్గర నుంచి సమయం వృధా చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు.. డిసెంబర్‌లోనే పోలవరం గ్రౌండ్ వర్కులు పూర్తి చేస్తాం.. పోలవరం ఆర్ & ఆర్, భూసేకరణ పరిస్ధితులను అధిగమిస్తాం.. వెంటనే ఆర్ & ఆర్ లో కాలనీల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తాం అని వెల్లడించారు..

Read Also: Shivam Dube – SKY: శివాలెత్తిన సూర్య-శివమ్ దూబే జోడి

ఇక, పాత ఏజెన్సీల బిల్స్ పూర్తి చేస్తాం.. అలాగే జీవో 35 ద్వారా అదే ఏజెన్సీలను కొనసాగిస్తాం అన్నారు మంత్రి నిమ్మల.. నిర్వాసితులకు తోడుగా అండగా ఉంటాం.. పెండింగ్ బిల్లులు 996 కోట్లు వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభిస్తాం అన్నారు.. పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలు పూర్తిస్ధాయిలో పరిష్కరించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. హంద్రీ-నీవా కాలువ పెంపుదల, పనులు ప్రారంభించాలని సీఎం చెప్పారు.. చింతలపూడి ఎత్తిపోతల కూడా 30 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు.. 2019లో చింతలపూడి పైన కేసులు వేశారు.. సుప్రీంకోర్టు ఆదేశించినా మూడు నెలల్లో ఈసీ అనుమతులు తీసుకోకుండా చింతలపూడి ఎత్తిపోతలను ప్రశ్నార్ధకంగా మార్చేశారని మండిపడ్డారు.. ఈసీ క్లియరెన్స్ త్వరగా వచ్చేలా చేయాలని మాకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.. వెలిగొండ ఫలాలు అందాలంటే ఇంకా రెండేళ్లు పడుతుందన్నారు.. 2026 జూన్ కల్లా నీరు వచ్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandrababu Polavaram Project Tour
  • cm chandrababu
  • Minister Nimmala Ramanaidu

తాజావార్తలు

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Hyderabad: ఫుడ్ సేఫ్టీ అధికారుల మొద్దు నిద్ర.. నగరంలో భారీగా కుళ్లిన మటన్, కెమికల్ పెరుగు, కల్తీ హలీం, అల్లం-వెల్లుల్లి పేస్ట్!

  • Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!

  • Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!

  • Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?

ట్రెండింగ్‌

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions