Minister Nara Lokesh: రేపు నేపాల్ నుంచి ఏపీకి తెలుగువారి తరలింపు..
- నేపాల్ లో 212 మంది ఆంధ్రులు..
- 12 లొకేషన్ లలో చిక్కుకున్న ఏపీవాసులు..
- ప్రత్యేక విమానంలో రేపు నేపాల్ నుంచి తీసుకు వస్తాం..
- మానీటరింగ్ చేస్తూనే ఉన్నామన్న మంత్రి లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: నేపాల్లో చిక్కుకున్న తెలువారి తరలింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. నేపాల్ రాజధాని ఖాట్మండ్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్లలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్తో పాటు సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీ నిరూప్ రెడ్డి ఉన్నారు. కుటుంబం సభ్యులు, బంధుమిత్రులు కలిపి 30 మంది ఇటీవల పశుపతినాథ్ ఆలయానికి వెళ్లారు. ప్రస్తుతం తాము ఖాట్మండ్లోని ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నామని, తమ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, నేపాల్ నుంచి బీహార్ బోర్డర్ కు 22 మంది తెలుగువారిని తరలించారు.. రేపు ఖాట్మాండ్ నుంచి బయలుదేరనుంది ప్రత్యేక విమానం.. ఏపీ భవన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. రేపు రాత్రికి ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు వచ్చే అవకాశం ఉంది.. సొంత జిల్లాలకు తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం..
Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేపాల్ పరిస్థితి పై చర్చించాం.. నేపాల్ లో తెలుగు వారి పరిస్థితి… ఏపీకి తీసుకు వచ్చే అంశం పై చర్చించాం అన్నారు మంత్రి నారా లోకేష్.. అనంతపురం సభ నుంచి హుటాహుటిన మంత్రులు అనిత, దుర్గేష్ వచ్చారని తెలిపారు లోకేష్.. ఏపీ భవన్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం.. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ లో టీడీపీ ఎంపీ సానా సతీష్ అధికారులతో సమీక్ష జరిపారు. 212 మంది ఆంధ్రులు నేపాల్ లో 12 లొకేషన్ లలో ఉన్నారు. ఖాట్మండ్ లో ఎక్కువ మంది ఉన్నారు. టైం టు టైం మానటిరంగ్ జరుగుతోంది. ఖాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానంలో రేపు ఆంధ్రుల ను నేపాల్ నుంచి తీసుకు వస్తాం.. ఆ ఫ్లైట్ శ్రీకాకుళం.. కడప లో ల్యాండ్ అవుతుందన్నారు.. ఇక, నేపాల్ బోర్డర్ లో తెలుగు వారు ముందు లక్నో చేరుకుంటారు.. లక్నో నుంచి ఏపీకి వస్తారు.. రేపు ఉదయం 10 గంటలకు ఆర్టిజిఎస్ లో మళ్ళీ సమావేశం అవుతాం. ప్రతి ఒక్కరిని వారి ఇంట్లో దింపే బాధ్యత తీసుకుంటాం.. మంత్రులు.. అధికారులు కలిసి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాత్రి కి ప్రతి ఒక్కరు చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం అన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!