Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Nara Lokesh Conducted The 38th Day Of Praja Darbar

Minister Nara Lokesh Praja Darbar: రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు

Published Date :October 1, 2024 , 1:40 pm
By Sudhakar Ravula
  • 38వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్..
  • ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా..
  • మంగళగిరితో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు..
Minister Nara Lokesh Praja Darbar: రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Nara Lokesh Praja Darbar: కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం.. ఈ ఓటీటీ క్లోజ్ ?

మంగళగిరి నియోజకవర్గం నుంచి పలు విజ్ఞప్తులు మంత్రి లోకేష్‌కి వచ్చాయి.. గ్రామస్థుల నుంచి రూ.3 కోట్ల వరకు అప్పుగా తీసుకుని పరారైన గొరిజాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పెదవడ్లపూడికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామంలో అనేక మంది వద్ద అప్పులు చేసిన శ్రీనివాసరావు.. వాటిని చెల్లించకుండా తప్పించుకునేందుకు పెదవడ్లపూడిని వదిలి కుటుంబంతో సహా గుంటూరుకు మకాం మార్చారని, ఇప్పుడు బెంగుళూరు పరారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన విధంగా న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన అక్కల శివశంకరరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇళ్లల్లోకి నీరు చేరి సామాగ్రి పూర్తిగా పాడైపోయాయని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మహానాడు ప్రాంత వాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని, విచారించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి నష్టపరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రోజువారీ కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తాను ఇటీవల అనారోగ్యం బారిన పడ్డానని, భర్త కూడా లేని తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆత్మకూరు వడ్డెరపాలెంకు చెందిన వేముల సీతమ్మ కోరారు.

Read Also: Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం.. ఈ ఓటీటీ క్లోజ్ ?

ఇక, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తే.. పట్టా భూమిని రీసర్వేలో గ్రామకంఠంగా నమోదు చేశారని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకొచ్చారు బాధితులు.. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కునింపూడిలో తన తండ్రికి చెందిన 1.95 ఎకరాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో గల్లా నాగవెంకట సత్యనారాయణ కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని ఏలూర జిల్లా కోడేలుకు చెందిన ఆదినాగు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో తమ కుటుంబానికి చెందిన 1.09 ఎకరాల పట్టాభూమిని గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో గ్రామకంఠంగా నమోదు చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని మార్కాపురానికి చెందిన రాచకొండ లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని, వెబ్ ల్యాండ్ నుంచి తొలగించిన తమ భూమిని పునరుద్ధరించి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఇలా పలు సమస్యలను విన్న లోకేష్‌.. ఆదుకుంటానని బాధితులకు హామీ ఇచ్చారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 38th day of Praja Darbar
  • Andhra Pradesh
  • Minister Nara Lokesh
  • Minister Nara Lokesh Praja Darbar

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions