Minister Nara Lokesh: పాదయాత్రలో రెడ్ బుక్ గురించి ఎవరూ పట్టించుకోలేదు.. కానీ..!
- జ్యూరిక్లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్'..
- పాల్గొన్న మంత్రి లోకేష్.. ఏపీ పునఃనిర్మాణానికి సహకరించాలని పిలుపు..
- పాదయాత్రలో రెడ్ బుక్ గురించి నేను మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు..
- చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేదిలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: పాదయాత్రలో రెడ్ బుక్ గురించి నేను మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు అన్నారు మంత్రి నారా లోకేష్.. జ్యూరిక్లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదు.. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే.. జ్యూరిక్లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదంటూ చమత్కరించారు. ఇక, తెలుగు జాతి సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన.. చేతిలో ఫైళ్లు పట్టుకొని న్యూయార్క్ వీధుల్లో తిరిగారు. ఆనాడు ఆయన విజన్-2020 అంటే ఎంతో మంది ఎగతాళి చేశారని పేర్కొన్నారు.. కేవలం రాజకీయాలే కాదు.. వ్యాపార రంగాల్లోనూ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు.. ఆయన మూడు సంస్థలు పెట్టి విఫలమైనా.. ఏమాత్రం అధైర్యపడకుండా పట్టుదలతో నాలుగో సంస్థగా హెరిటేజ్ను స్థాపించారు.. అనుకున్నది సాధించారని పేర్కొన్నారు..
Read Also: Minister Nimmala Ramanaidu: 20 లక్షల ఉద్యోగాలు అందించేందుకు సంకల్పించాం..
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ఇక, రాష్ట్ర పునఃనిర్మాణం కోసం మన శక్తిని పెట్టాలన్నారు లోకేష్.. ఏపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.. ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికే చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. అప్పులపాలయ్యం.. వడ్డిలు కట్టలేకపోతున్నాం.. జీతాలు చెల్లించలేకపోతున్నాం.. ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు.. తెలుగు వాళ్లు.. రాష్ట్రాన్ని వదిలేసి బాగుపడ్డారు.. కానీ, రాష్ట్రం వెనుకబడింది.. ఇప్పుడంతా సహాయం చేయండి.. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం.. ఏపీ పునర్నిర్మాణం కోసం అంతా కలిసి పనిచేయాలి. మీ సహకారం, తోడ్పాటు రాష్ట్రానికి అవసరం. రానున్న ఐదేళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాం అన్నారు.. విదేశాల్లో ఉన్న తెలుగువారి ఫీడ్ బ్యాక్ మాకు చాలా అవసరం, అభివృద్ధి పరంగా.. రాజకీయంగా కూడా మీ సలహాలు అవసరం అన్నారు.. చాలా మంది దగ్గర నా వాట్సాప్ నంబర్ ఉంది.. నాకు ఫీడ్ ఇవ్వొచ్చు అన్నారు.. ఇక, పాదయాత్రలో రెడ్బుక్ గురించి ఎవరూ పట్టించుకోలేదన్నా నారా లోకేష్.. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పాను.. ఇప్పటికే మొదలైది.. పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా తీసుకుంటాం అన్నారు.. కానీ, రాజకీయ కక్షలు ఉండవని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!