పాదయాత్రలో రెడ్ బుక్ గురించి నేను మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు అన్నారు మంత్రి నారా లోకేష్.. జ్యూరిక్లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదు.. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే.. జ్యూరిక్లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదంటూ చమత్కరించారు.