Minister Nara Lokesh: అప్పుడు వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన.. మంత్రి లోకేష్
- పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్..
- "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు..
- ప్రారంభించిన మంత్రి నారా లోకేష్..
- గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే..
- ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. బటన్ నొక్కితే భోజనం.. సినిమా టికెట్లు వచ్చినపుడు పాలన ఎందుకు అందుబాటులోకి రాదు అనే ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు లోకేష్.. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాంఅన్నారు.. మొదటి విడతలో 160కి పైగా పౌర సేవలు. రెండో విడతలో 300కి పైగా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు లోకేష్..
Read Also: Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఊరు నుంచి ఇంకో ఊరు పాదయాత్రలో వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ ల కోసం మమ్మల్ని తిప్పవద్దు అని చాలా మంది అడిగారని గుర్తుచేసుకున్నారు లోకేష్.. గత ఐదేళ్లలో సర్టిఫికెట్లు కూడా కొన్ని సందర్భాల్లో రాలేదు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ పోటీ చేస్తే గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని విమర్శించారు.. సర్టిఫికెట్ కోసం ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశం.. ప్రస్తుతం 60 శాతం మందికి వాట్సాప్ సౌకర్యం ఉంది. అందుకే ఈ ఆలోచనతో వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టామని వెల్లడించారు.. ప్రపంచంలో ఎక్కడా ఇలా చేసిన పరిస్థితి లేదు.. 36 శాఖల నుంచి సమన్వయం చేసుకోవాలి. మొదటి విడత లో 161 పౌర సేవలు ఉంటాయి. రెండో విడత లో 300 కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయి.. ప్రతి సర్టిఫికెట్కు QR కోడ్ ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్కు అవకాశం ఉండదు అని స్పష్టం చేశారు.. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ ఇలా రకరకాల సర్వీస్ లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్లో కీలక వ్యాఖ్యలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!