Minister Nara Lokesh: అప్పుడు వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన.. మంత్రి లోకేష్
- పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్..
- "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు..
- ప్రారంభించిన మంత్రి నారా లోకేష్..
- గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే..
- ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు..
Minister Nara Lokesh: తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. బటన్ నొక్కితే భోజనం.. సినిమా టికెట్లు వచ్చినపుడు పాలన ఎందుకు అందుబాటులోకి రాదు అనే ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు లోకేష్.. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాంఅన్నారు.. మొదటి విడతలో 160కి పైగా పౌర సేవలు. రెండో విడతలో 300కి పైగా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు లోకేష్..
Read Also: Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
ఊరు నుంచి ఇంకో ఊరు పాదయాత్రలో వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ ల కోసం మమ్మల్ని తిప్పవద్దు అని చాలా మంది అడిగారని గుర్తుచేసుకున్నారు లోకేష్.. గత ఐదేళ్లలో సర్టిఫికెట్లు కూడా కొన్ని సందర్భాల్లో రాలేదు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ పోటీ చేస్తే గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని విమర్శించారు.. సర్టిఫికెట్ కోసం ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశం.. ప్రస్తుతం 60 శాతం మందికి వాట్సాప్ సౌకర్యం ఉంది. అందుకే ఈ ఆలోచనతో వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టామని వెల్లడించారు.. ప్రపంచంలో ఎక్కడా ఇలా చేసిన పరిస్థితి లేదు.. 36 శాఖల నుంచి సమన్వయం చేసుకోవాలి. మొదటి విడత లో 161 పౌర సేవలు ఉంటాయి. రెండో విడత లో 300 కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయి.. ప్రతి సర్టిఫికెట్కు QR కోడ్ ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్కు అవకాశం ఉండదు అని స్పష్టం చేశారు.. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ ఇలా రకరకాల సర్వీస్ లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?