Minister Nara Lokesh: అప్పుడు వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన.. మంత్రి లోకేష్
- పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్..
- "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు..
- ప్రారంభించిన మంత్రి నారా లోకేష్..
- గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే..
- ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. బటన్ నొక్కితే భోజనం.. సినిమా టికెట్లు వచ్చినపుడు పాలన ఎందుకు అందుబాటులోకి రాదు అనే ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు లోకేష్.. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాంఅన్నారు.. మొదటి విడతలో 160కి పైగా పౌర సేవలు. రెండో విడతలో 300కి పైగా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు లోకేష్..
Read Also: Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఊరు నుంచి ఇంకో ఊరు పాదయాత్రలో వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ ల కోసం మమ్మల్ని తిప్పవద్దు అని చాలా మంది అడిగారని గుర్తుచేసుకున్నారు లోకేష్.. గత ఐదేళ్లలో సర్టిఫికెట్లు కూడా కొన్ని సందర్భాల్లో రాలేదు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ పోటీ చేస్తే గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని విమర్శించారు.. సర్టిఫికెట్ కోసం ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశం.. ప్రస్తుతం 60 శాతం మందికి వాట్సాప్ సౌకర్యం ఉంది. అందుకే ఈ ఆలోచనతో వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టామని వెల్లడించారు.. ప్రపంచంలో ఎక్కడా ఇలా చేసిన పరిస్థితి లేదు.. 36 శాఖల నుంచి సమన్వయం చేసుకోవాలి. మొదటి విడత లో 161 పౌర సేవలు ఉంటాయి. రెండో విడత లో 300 కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయి.. ప్రతి సర్టిఫికెట్కు QR కోడ్ ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్కు అవకాశం ఉండదు అని స్పష్టం చేశారు.. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ ఇలా రకరకాల సర్వీస్ లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!