Minister Nara Lokesh: అప్పుడు వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన.. మంత్రి లోకేష్
- పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్..
- "మన మిత్ర" పేరుతో దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు..
- ప్రారంభించిన మంత్రి నారా లోకేష్..
- గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే..
- ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. బటన్ నొక్కితే భోజనం.. సినిమా టికెట్లు వచ్చినపుడు పాలన ఎందుకు అందుబాటులోకి రాదు అనే ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు లోకేష్.. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాంఅన్నారు.. మొదటి విడతలో 160కి పైగా పౌర సేవలు. రెండో విడతలో 300కి పైగా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు లోకేష్..
Read Also: Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
ఊరు నుంచి ఇంకో ఊరు పాదయాత్రలో వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ ల కోసం మమ్మల్ని తిప్పవద్దు అని చాలా మంది అడిగారని గుర్తుచేసుకున్నారు లోకేష్.. గత ఐదేళ్లలో సర్టిఫికెట్లు కూడా కొన్ని సందర్భాల్లో రాలేదు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ పోటీ చేస్తే గత ప్రభుత్వం బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని విమర్శించారు.. సర్టిఫికెట్ కోసం ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అనేది మా ఉద్దేశం.. ప్రస్తుతం 60 శాతం మందికి వాట్సాప్ సౌకర్యం ఉంది. అందుకే ఈ ఆలోచనతో వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టామని వెల్లడించారు.. ప్రపంచంలో ఎక్కడా ఇలా చేసిన పరిస్థితి లేదు.. 36 శాఖల నుంచి సమన్వయం చేసుకోవాలి. మొదటి విడత లో 161 పౌర సేవలు ఉంటాయి. రెండో విడత లో 300 కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయి.. ప్రతి సర్టిఫికెట్కు QR కోడ్ ఉంటుంది. ఫేక్ సర్టిఫికెట్కు అవకాశం ఉండదు అని స్పష్టం చేశారు.. రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ ఇలా రకరకాల సర్వీస్ లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?