AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వాటికి లైన్ క్లియర్
- సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
- కీలక అంశాలపై చర్చ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్రపడింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ నిర్ణయాలను వివరించారు.. జల్ జీవన్ మిషన్ పథకం అమలు జరగకపోవడం గత ప్రభుత్వం చేసిన నష్టానికి ఉదాహరణగా పేర్కొన్న ఆయన.. లక్ష నుంచి లక్షన్నరకి ప్రతిపాదనలు పంపించాయి కేరళ లాంటి చిన్న రాష్ట్రాలు సైతం జలజీవన్ మిషన్ కి.. కానీ, పరిశుభ్రమైన నీటికి లక్షలాది ప్రజలు దూరమయ్యారని తెలిపారు.. అయితే, 25 శాతం కంటే తక్కువ పనులు 11,400 కోట్లు.. వాటికి రీటెండరింగ్ జరుగుతుంది.. వాటికి కేబినెట్ అనుమతి మంజూరు చేసిందన్నారు.. డోన్, ఉత్థానం, పులివెందులలో పనులు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చింది.. స్థిరమైన నీటి వనరులు వినియోగం ద్వారా త్రాగునీటి వసతి ఇవ్వాలన్నది జల్ జీవన్ మిషన్ ఉద్దేశం అన్నారు..
Read Also: Bird Flu: మానవుడిలో తొలిసారిగా తీవ్రమైన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ గుర్తింపు..
Also Read
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ఇక, ఇప్పటి వరకూ డోలాయమానంలో ఉన్న అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు ఇచ్చాయి.. 45 ఇంజనీరింగ్ పనులు 33,137 కోట్లతో పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రి పార్థసారథి.. గ్రామకంఠ భూముల సర్వే, రికార్డింగ్ లో 48,899 సబ్ డివిజన్ చేయడానికి అర్జీలు వచ్చాయి.. వాటికి ఫీజు రాయితీ ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నా యన.. వరదల్లో ముంపుకు గురైనవారి రుణాలపై యూజర్ ఛార్జీలు ఎత్తివేయడానికి, రుణాలు రీషెడ్యూల్ చేయడానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.. మార్క్ ఫెడ్ కు 1000 కోట్ల అదనపు రుణాన్ని పొందేందుకు ఆమోదం లభించింది.. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు రీడెండరింగ్ కు కేబినెట్ ఆమోదించింది.. హంద్రీనీవా కింద పుంగనూరు బ్రాంచి కెనాల్ కు పాత రేట్ల ప్రకారమే చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో NTPC జాయింట్ వెంచర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. 1.06 లక్షల ఉపాధి అవకాశాలు ఈ జాయింట్ వెంచర్ ద్వారా వస్తాయన్నారు..
Read Also: Heavy Rains in Andhra Pradesh: ఏపీలో విస్తారంగా వానలు.. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
మరోవైపు.. ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించనున్నాం.. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, కేజీబీవీల్లో ఈ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పార్థసారథి.. ఈ పథకాన్ని పునరుద్ధరించడం వల్ల 1.4 లక్షల మంది విద్యార్థులు ఉపయోగపడుతుందన్నారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరాకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.. ప్రభుత్వ కాలేజీలలో సైతం జేఈఈ వంటి పరీక్షలకు కావాల్సి ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..