Janavani: జనసేన కార్యాలయంలో జనవాణి.. భూకబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ
- జనసేన కేంద్ర కార్యాలయంలో జనవాణి..
- ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరణకోసం జనవాణి కార్యక్రమం..
- భూ కబ్జాలు, ఆక్రమణలపై జనవాణికి ఫిర్యాదుల వెల్లువ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janavani: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి జనవాణి కార్యక్రమం నిర్వహించారు.. భూ కబ్జాలు, ఆక్రమణలపై జనవాణికి ఫిర్యాదులు వెల్లువలా వచ్చినట్టు జనసేన ప్రకటించింది.. అయితే, వైసీపీ నేతల దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నట్టు చెబుతున్నారు.. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి భూబాధితులు క్యూ కడుతున్నారని జనసేన తెలిపింది.. ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తోంది.. భూ ఆక్రమణలు, రికార్డుల తారుమారుపై కూడా ఫిర్యాదు అందాయి.. భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నట్టు వెల్లడించారు..
Read Also: Railway Budget For AP: రైల్వే బడ్జెట్.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు..
Also Read
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వెనామపాలెంలో తమకు వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమిలో దూడల వెంకయ్య అనే వ్యక్తి వైసీపీ నేతల అండతో రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారని.. మా భూమిని ప్లాట్లుగా మార్చేసి దొంగ డాక్యుమెంట్లతో 60 మందికి విక్రయించారని చంద్రకళ అనే మహిళ ఫిర్యాదు చేసింది.. ఇక, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన సామెల్ తన తండ్రికి బ్రిటీష్ వారు ఇనాంగా ఇచ్చిన 12 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో హస్సేన్ రెడ్డి, టంగుటూరు రామిరెడ్డితో పాటు మరో నలుగురు కలిసి ఆక్రమించారంటూ జనవాణిని ఆశ్రయించారు.. ఇలా భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జనవాణికి వచ్చాయి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?