AP CEO: పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడుతూ.. పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చిందన్నారు. జీరో వయొలెన్స్, జీరో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్ కామ్ పెట్టామని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల లోపల.. బయట వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని ఏపీ సీఈఓ చెప్పారు.
RCB vs DC: మమ్మల్ని ఓడించడం ఢిల్లీకి కష్టమే: బెంగళూరు కోచ్
Also Read
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
మరోవైపు.. పోల్ డేటా మానిటరింగ్ సిస్టం-PDMS యాప్ ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని చోట్ల కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారనే సమాచారం వస్తోందని.. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీస్ అబ్జర్వర్లు, జనరల్ అబ్జర్వర్లను ఈసీ నియమించిందని అన్నారు. ఓటర్లను ఎన్నికలకు రాకుండా చేసేలా ఎవరైనా వేళ్లపై ఇంకు గుర్తు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 20 శాతం మేర ఈవీఎంల బఫర్ స్టాక్ వచ్చిందని.. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించే మెకానిజం ఏర్పాటు చేసుకున్నామని ఏపీ సీఈఓ తెలిపారు.
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో స్వేచ్ఛ కోసం పోరాటం.. భారీగా నిరసనలు..
గతం కంటే ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం జరిగిందని ఎంకే మీనా చెప్పారు. ఈసారి 90 శాతం మేర పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగిందని.. దూర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని ఆర్టీసీ ఎండీతో మాట్లాడామని.. ఎన్నికల సిబ్బంది నిమిత్తం కొన్ని ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నామని తెలిపారు. మరోవైపు.. వృద్ధులకు, దివ్యాంగులకు పోలింగ్ స్టేషన్లల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!