AP Legislative Council: మండలిలో కేసులపై చర్చ.. నేతల కస్సు బుస్సు
- శాసన మండలిలో కేసులపై చర్చ..
- రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయన్న నాగబాబు..
- గత ప్రభుత్వంలో సోషల్ మీడియా పోస్టులపై కూడా కేసులన్న అనిత..
- 16 నెలలు గడిచినా గత ప్రభుత్వంపై ఆరోపణలు ఏంటన్న బొత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Legislative Council: శాసన మండలిలో వివిధ అంశాలపై చర్చ సాగుతోన్న తరుణంలో కూటమి సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య కస్సు బస్సు వాతావరణం కనిపించింది.. ఇక, మండలిలో కేసులపై చర్చ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి అన్నారు. కొందరు వ్యక్తులు తప్పులు చేయకపోయినా కేసులు పెట్టించుకుని జైళ్లో ఉండాల్సి వస్తుంది.. వాళ్ళు జైళ్లో ఉన్న సమయాన్ని ఎలా తిరిగి ఇవ్వగలం..? అని ప్రశ్నించారు. చట్టాన్ని తమ చుట్టాల్లా ప్రభుత్వాలు వాడుకుంటే ఇబ్బందులు సాధారణ వ్యక్తులు పడాల్సి వస్తుందన్న ఆయన.. కొందరు విద్యార్ధులపై కేసులు నమోదైన సమయాల్లో పాస్ పోర్ట్ ల కోసం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.. రాజకీయ కక్ష్యలతో పెట్టిన కేసుల వల్ల సామాన్యులు జీవితాలు తారుమారు అవుతున్నాయి.. తప్పుడు కేసులపై చూస్తూ కూర్చుంటే సామాన్యులకు అండగా ఉండలేం.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని సూచించారు నాగబాబు..
Read Also: Jyothi Poorvaj : సీనియర్ ఆంటీ జ్యోతి పుర్వాజ్.. హాట్ ఫోజులతో అదరగొడుతుందిగా
Also Read
- CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
అయితే, గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పెట్టిన కేసులు సంఖ్యను కూడా చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం.. మరోవైపు, హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులపై కూడా కేసులు పెట్టారు.. మా ప్రభుత్వం వచ్చాక ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదు అని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వం మహిళలు ఎవరైనా పోస్టింగులు పెట్టినా వారిని కూడా వదల్లేదు.. అమరావతి రైతులపై పెట్టిన కేసులకు లెక్క లేదు. నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు.. నేను ఇప్పటికీ కోర్టుకు వెళ్తున్నానని వెల్లడించారు.. ఎవరు నిరసనలు చేసినా అరెస్టులు చేశారు.. గత ప్రభుత్వ హయాంలో మా మీద అక్రమ కేసులు పెట్టారు రద్దు చేయాలని 3116 మంది మా దృష్టికి తెచ్చారు.. పాస్ పోర్ట్ ల విషయంలో కూడా చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు.. వాళ్లు ఉద్యోగాలకు కూడా అనర్హత పొందుతున్నారు.. మా ప్రభుత్వం అక్రమ కేసులు ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు హోం మంత్రి అనిత…
ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా .. ఇప్పటికీ ఆ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు.. అవసరం అయినప్పుడు మాట్లాడితే ఫర్వాలేదు.. కానీ, ఇంకా గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని ఫైర్ అయ్యారు.. రాజకీయ ఆరోపణలు చేయటం తప్ప.. ఈ ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు.. ఇది సాంప్రదాయం కాదు.. దీని మీద మా నిరసన తెలియజేస్తూ ఈ ప్రశ్న నుంచి వాకౌట్ చేస్తున్నాం అంటూ.. శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు బొత్స సత్యనారాయణ..
తాజావార్తలు
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!